Chiranjeevi: “ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందింది”.. చిరు కామెంట్స్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకి గుడ్ బై చెప్పి చాలాకాలం అయింది. అయితే తనకు నచ్చిన పొలిటిషియన్స్కు ఆయన వ్యక్తిగతంగా మద్దతు తెలుపుతూ వస్తున్నారు. తాజాగా చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రజా రాజ్యం ఇప్పుడు మారిపోయి జనసేనగా రూపాంతరం చెందిందని మెగాస్టార్ కామెంట్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి నోట జై జనసేన మాట వినిపించింది. నాటి ప్రజారాజ్యం నేటి జనసేనగా మారిందన్నారు చిరు. ఇందుకు తాను సంతోషంగా ఉన్నానని ప్రకటించారు. హైదరాబాద్లో లైలా మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఈ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న నేపథ్యాన్ని స్టేజ్పై వివరించారు చిరంజీవి. విశ్వక్ సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైలా సినిమా ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజుతో తనకు పరిచయం ఉందన్న చిరంజీవి.. ప్రజారాజ్యం సమయంలో రాజకీయంగా రాజు కీలకంగా ఉండేవారని చెప్పారు. అప్పటి ప్రజారాజ్యమే నేడు జనసేనగా రూపాంతరం చెందింది అని చిరు అన్నారు. అందుకు తనకు ఆనందంగా ఉందన్నారు. అప్పుడు కరాటే రాజుకు అవకాశం ఇచ్చాను. కాని ఇప్పుడు పరిస్థితులు మారాయంటూ స్టెజ్పై కామెంట్ చేశారు.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్
మత్స్యకారుల వలలో అరుదైన చేపలు.. అబ్బా అదృష్టం అంటే వీళ్లదే
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం

