Anchor Rashmi Gautam: మంత్రి కేటీఆర్‌ సాయం కోరిన యాంకర్‌ రష్మీ గౌతమ్‌.. దేని కొరకు అంటే..!

|

Jul 30, 2021 | 5:58 AM

Anchor Rashmi Gautam: బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తున్న రష్మి గౌతమ్‌.. జంతు ప్రేమికురాలనే విషయం చాలా మందికి తెలిసిందే. అయితే మూగ జీవాలకు ఏదైనా హాని జరిగితే..

Anchor Rashmi Gautam: మంత్రి కేటీఆర్‌ సాయం కోరిన యాంకర్‌ రష్మీ గౌతమ్‌.. దేని కొరకు అంటే..!
Follow us on

Anchor Rashmi Gautam: బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తున్న రష్మి గౌతమ్‌.. జంతు ప్రేమికురాలనే విషయం చాలా మందికి తెలిసిందే. అయితే మూగ జీవాలకు ఏదైనా హాని జరిగితే ఆమె వెంటనే స్పందిస్తుంది. లాక్‌డౌన్‌లోనూ వీధి కుక్కలు, పావురాల కోసం ప్రతిరోజూ ఆహారం అందించేది. అంతేకాదు.. జంతు పరిరక్షణ కోసం ఆమె ప్రత్యేకంగా పలు అవగాహన కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ వస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా రష్మి తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ఓ విషయంపై విజ్ఞప్తి చేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో శునకాలకు ఏబీసీ (యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌) ఆపరేషన్‌ చేసి అలాగే వదిలేస్తున్నారని, దీనికి ఏదైనా పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆమె మంత్రి కేటీఆర్‌ను కోరింది. ఈ మేరకు ఆమె ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌ కార్యాలయ ఖాతాతో పాటు కేటీఆర్‌ వ్యక్తిగత ట్విటర్‌ ఖాతాను ట్యాగ్‌ చేస్తూ ఓ ట్వీట్‌ చేసింది.

గతం కొంతకాలంగా హైదరాబాద్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో వీధికుక్కల సంఖ్యను తగ్గించేందుకు ఆ శునకాలకు వైద్య సిబ్బంది ఆపరేషన్‌ చేసి అలాగే వదిలి పెడుతున్నారు. ఆపరేషన్‌ తర్వాత చేయాల్సిన చికిత్స చేయకుండానే రోడ్లపైనే వదిలి పెడుతున్నారు. అయితే.. అలాంటి శునకాల ఫొటోలను వివరాలతో సహా సేవ్‌యానిమల్స్‌ఇండియా అనే ట్విటర్‌ ఖాతా ద్వారా ఓ నెటిజన్‌ కొంతకాలంగా ట్విటర్‌లో పోస్టు చేస్తూ వస్తున్నారు. ఇలా దాదాపు 2,122 శునకాలను ఆపరేషన్‌ చేసి ఇలాగే నిర్దాక్షిణ్యంగా రోడ్డుపై వదిలేశారని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. పై అధికారులు తమకు విధించిన రోజువారీ టార్గెట్‌ రీచ్ కావడం కోసం వైద్య సిబ్బంది ఇలా శునకాలను హింసించడం సరికాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి దీనిపై మంత్రి కేటీఆర్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.

 

ఇవీ కూడా చదవండి

IRCTC: ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్‌.. ఉచితంగా లక్ష రూపాయల వరకు గెలుచుకునే అవకాశం..!

NPS Scheme: ఎన్‌పీఎస్‌ స్కీమ్‌లో చేరిన వారికి గుడ్‌న్యూస్‌.. కొత్త సేవలు అందుబాటులోకి..!