పవన్తో రెండోసారి.. హిట్ కాంబో రిపీట్ అవ్వబోతోందా..!
పవర్స్టార్ పవన్ కల్యాణ్ మూడు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో రెండు సినిమాల షూటింగ్లు కూడా ప్రారంభమయ్యాయి.
పవర్స్టార్ పవన్ కల్యాణ్ మూడు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో రెండు సినిమాల షూటింగ్లు కూడా ప్రారంభమయ్యాయి. వాటిలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న వకీల్ సాబ్ ఒకటి. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీని మేలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. కానీ కరోనా నేపథ్యంలో ఈ మూవీ విడుదల దసరాకు వాయిదా పడ్డట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ మూవీలో హీరోయిన్గా పలువురి పేర్లు వినిపించాయి. ఇక శ్రుతీ హాసన్ ఫైనల్ అయినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే వాటిపై స్పందించిన శ్రుతీ.. తాను ఈ మూవీలో లేనని స్పష్టం చేసింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ రీమేక్లో పవన్ సరసన ఇలియానా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఒకవేళ అన్నీ కుదిరితే 12 సంవత్సరాల తరువాత పవన్తో ఇలియానా మళ్లీ రొమాన్స్ చేసే అవకాశం ఉంది. కాగా జల్సా మూవీలో ఈ ఇద్దరు కలిసి నటించగా.. ఆ విజయం పెద్ద విజయం సాధించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీలక పాత్రల్లో అంజలి, నివేథా థామస్, అనన్య నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. దాదాపు రెండేళ్ల తరువాత పవన్ రీ ఎంట్రీ ఇస్తోన్న ఈ మూవీపై అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు.
Read This Story Also: ‘ఆచార్య’ విషయంలో మహేష్కి, నాకు మధ్య జరిగిన సంభాషణ ఇదే..!