
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మించిన సినిమా “తిమ్మరాజుపల్లి టీవీ”. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా నటించారు. “తిమ్మరాజుపల్లి టీవీ” చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్నిసొంతం చేసుకుంది.
తాజాగా ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమయ్యింది. “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా ఈ నెల 15వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఆహా గోల్డ్ యూజర్స్ 24 గంటల ముందుగానే ఈ చిత్రాన్ని చూడొచ్చు. థియేట్రికల్ గా ప్రేక్షకుల్ని అలరించిన “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా ఇప్పుడు ఆహా ద్వారా మరింతమంది ఆడియెన్స్ కు చేరువకానుంది.
చిన్న సినిమాగా వచ్చిన తిమ్మరాజుపల్లి టీవీ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా పై సినీ ప్రముఖలు ప్రశంసలు కురిపించారు. సినిమాలో ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ఆహాలో ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.