OTT Movie: భర్త అహంకారానికి భార్య ప్రతీకారం.. అప్పుడే ఓటీటీలోకి కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ 'జయ జయ జయ జయహే’ కు రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే మలయాళంలో మాదిరి ఇక్కడ హిట్ కాలేదు. జస్ట్ యావరేజ్ గా నిలిచింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.

OTT Movie: భర్త అహంకారానికి భార్య ప్రతీకారం.. అప్పుడే ఓటీటీలోకి కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Om Shanti Shanti Shantihi M

Updated on: Feb 23, 2026 | 6:27 PM

టాలీవుడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన సినిమా ‘ఓం శాంతి శాంతి శాంతిః’. తెలుగమ్మాయి ఇషా రెబ్బా హీరోయిన్ గా నటించింది. 2022లో మలయాళంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘జయ జయ జయహే’ కు ఇది రీమేక్. రిలీజ్ కు ముందు ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్స్, పోస్టర్స్, గ్లింప్స్, ట్రైలర్ కు ఆడియెన్స్ నుంచి మంచి స్పందనే వచ్చింది. అయితే జనవరి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ జస్ట్ యావరేజ్ గా నిలిచింది. మలయాళం రేంజ్ లో హిట్ అందుకోలేకపోయింది. అయితే గోదావరి యాస్ లో సాగే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా హీరోయిన్ ఇషా యాక్టింగ్ కు ప్రశంసలు వచ్చాయి. అలాగే ఓంకార్ నాయుడిగా తరుణ్ భాస్కర్ కూడా అదరగొట్టాడు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మార్చి 4 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గోల్డ్ సబ్‌స్క్రైబర్స్ కోసం ఒకరోజు ముందే ఆహా ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది.

. ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమాకు ఏఆర్‌ సజీవ్‌ దర్శకత్వం వహించారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. కిషోర్ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరించారు. హీరో, హీరోయిన్లతో పాటు బ్రహ్మాజీ, గోపరాజు విజయ్ తదితరులు ఈమూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. జై క్రిష్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

ఆహాలో స్ట్రీమింగ్..

తరుణ్ భాస్కర్ సినిమాపై ఒక నెటిజన్ రివ్యూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us