
మీకు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టమా? ఓటీటీలో మంచి ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకుంటున్నారా? అయితే ఒక కిర్రాక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఒకటి ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం పదేళ్ల క్రితం అంటే 2016లో విడుదలైంది. కానీ ఇప్పటికీ టాప్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో జాబితాలో ఈ మూవీ పేరు కచ్చితంగా ఉంటుంది. ఈ చిత్రం పేరు ‘ధ్రువంగళ్ పతినారు’ (డి-16). కార్తీక్ నరేన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెరకెక్కించే నాటికి కార్తీక్ వయస్సు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. కానీ ఆకట్టుకునే కథ, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో తో ఆడియెన్స్ కు మంచి థ్రిల్లర్ మూవీ అందించాడు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక ప్రమాదం కారణంగా కాలేజీ రోజుల నాటి ఒక హత్య కేసును దర్యాప్తు చేస్తూ కాలు కోల్పోయిన రిటైర్డ్ ఇన్స్పెక్టర్, తన కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసును ఎలా ఛేదించాడనేది ఈ సినిమా కథ.. ఈ సినిమా కథ మొత్తం రిటైర్డ్ పోలీస్ అధికారి దీపక్ (రహమాన్) చుట్టూ తిరుగుతుంది. ఒక ప్రమాదంలో దీపక్ తన కాళ్లను కోల్పోతాడు. తన కెరీర్లోని చివరి, అసంపూర్తిగా ఉన్న ఓ కేసు గురించి విచారిస్తుంటాడు. ఇందులో ఒకే రాత్రి మూడు వేర్వేరు సంఘటనలు (ప్రమాదం, ఆత్మహత్య , హత్య) జరుగుతాయి. ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులకు ఊహించలేని షాక్ ఇస్తుంది. ఇందులో పోలీసుల దర్యాప్తును చాలా నిశితంగా చూపించారు. ఈ చిత్రాన్ని హిందీలో కూడా నిర్మించనున్నారని ప్రచారం జరుగుతోంది. హిందీలో కథానాయకుడిగా నటుడు వరుణ్ ధావన్ నటిస్తున్నట్లు తెలిసింది. గతంలో దీనిని కన్నడలో కూడా రీమేక్ చేశారు. దాని పేరు ‘దృశ్య’.
ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే. ఈ సినిమా నిడివి కేవలం గంటా 45 నిమిషాలు మాత్రమే. IMDBలో ఈ మూవీకి 10కి 8.2 రేటింగ్ లభించింది. అలాగే ఈ చిత్రం అనేక అవార్డులను కూడా గెలుచుకుంది. వెంకటేష్, మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం’ వంటి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు మీకు నచ్చితే , ఈ సినిమా కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓరిజినల్ వెర్షన్ జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. అలాగే తెలుగు వెర్షన్ మాత్రం ఆహా ఓటీటీతో పాటు జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.