
సినిమాల్లో మంచి కంటెంట్ ఉన్నప్పటికీ ఒక్కోసారి థియేటర్లలో ఆడవు. ప్రమోషన్లు పెద్దగా లేకపోవడం, పేరున్న నటీనటులు ఉండకపోవడం, బరిలో ఇతర సినిమాలు ఉండడం.. ఇలా థియేటర్లలో సినిమాలు ఆడకపోవడానికి చాలా కారణాలుంటాయి. అయితే ఇదే సినిమాలు ఓటీటీలోకి వస్తే ఓ రేంజ్ లో రెస్పాన్స్ తెచ్చుకుంటాయి. ప్రస్తుతం మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. థియేటర్లలో విడుదలైనప్పుడు ఈ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ ఓటీటీలో మాత్రం దుమ్ముదులుపుతోంది. ఆసక్తికరమైన కథా కథనాలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులు పుష్కలంగా ఉండడంతో ఈ సినిమా ఓటీటీలో సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కర్ణాటక , ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న ప్రాంతంలో వరుసగా అమ్మాయిలు హత్యలకు గురువుతుంటారు. మహిళల్ని అత్యంత కిరాతకంగా హత్య చేస్తోన్న సైకో వారి తలల స్థానంలో దిష్టి బొమ్మలను పెడుతుంటాడు. దీంతో ఈ హత్యలు రెండు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్ఠిస్తాయి. 17 మంది అమ్మాయిలు హత్యకు గురైనా పోలీసులు ఒక్క క్లూ కూడా సంపాదించలేకపోతారు.
చివరకు ఈ సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడానికి స్థానికంగా పేరున్న ఓ డిటెక్టివ్ రంగంలోకి దిగుతాడు. ఈ సీరియల్ మర్డర్స్ వెనుక క్రాస్-స్టేట్ కనెక్షన్ ఉందని విచారణలో తెలుసుకుంటాడు. అంతేకాదు క్షుద్ర పూజలు, నరబలుల నేపథ్యం కూడా ఉందని వెలుగులోకి వస్తుంది. ఎవరి ఊహలకు అందని కొన్ని సంచలన విషయాలు కూడా వెలుగులోకి వస్తాయి. మరి అమ్మాయిల వరుస హత్యలకు కారణమెవ్వరు? ఆ సీరియల్ సైకో కిల్లర్ ఉద్దేశమేంటి? అమ్మాయిల తలలను ఎందుకు నరుకుతున్నాడు. వాటి స్థానంలో దిష్ట బొమ్మలను ఎందుకు తగిలిస్తున్నాడు? క్షుద్ర పూజలు, నరబలులతో వీటికి ఏమైనా సంబంధం ఉందా? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మాత్రం ఎవరి ఊహలు, అంచనాలకు అందకుండా ఎంతో థ్రిల్లింగ్ గా సాగుతాయి.
ఈ సినిమా పేరు భూతద్దం భాస్కర్ నారాయణ. పురుషోత్తం రాజ్ తెరకక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో యంగ్ హీరో, హీరోయిన్లు శివ కందుకూరి, రాశి సింగ్ అరుణ్ కుమార్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా రెండు ఓటీటీల్లో నూ స్ట్రీమింగ్ అవుతోంది. ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్ ఫామ్స్ లలో ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అందుబాటులో ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.