Puri Raviteja Movie: 2015లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘టెంపర్’ చిత్రం తర్వాత వరుస పరాజయాలను ఎదుర్కొన్నాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. వరుసగా ఆరు సినిమాల వైఫల్యం తర్వాత ‘ఈస్మార్ట్ శంకర్’ చిత్రంతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. మంచి కథ దొరికితే తన సినిమా ఎలా ఉంటుందో నిరూపించుకున్నాడు.
ఇక ఈస్మార్ట్ శంకర్ విజయం తర్వాత కెరీర్పై మరింత ఏకాగ్రత పెంచి పూరీ జగన్నాథ్.. మరోసారి అదే ఊపును కొనసాగించాలని డిసైడ్ అయ్యాడు. ఇందులో భాగంగానే యంగ్ హీరో విజయ్ దేవరకొండతో ‘లైగర్’ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో పడ్డాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత వరుస చిత్రాలను లైన్లో పెట్టడానికి పూరీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పూరీ జగన్నాథ్ నాగార్జునతో ఓ సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చాయి. అయితే దానిపై తర్వాత మళ్లీ ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇదిలా ఉంటే తాజాగా మరో వార్త హల్చల్ చేస్తోంది. అదే.. పూరీ తన తర్వాతి చిత్రాన్ని మాస్ మహారాజ రవితేజతో ప్లాన్ చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’, ‘ఇడియట్’, ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ వంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే చివరిగా 2012లో వచ్చిన ‘దేవుడు చేసిన మనుషులు’ డిజాస్టర్గా మిగిలింది. దీంతో మళ్లీ రవితేజతో ఓ హిట్ కొట్టాలనే ఉద్దేశంతోనే పూరీ ఈ సినిమాను లైన్లో పెట్టనున్నాడని సమాచారం. ఇక రవితేజ ప్రస్తుతం.. రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. పూరీ ‘లైగర్’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తికాగానే వీరిద్దరి కాంబినేషన్లో కొత్త సినిమా ప్రారంభంకానుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
Also Read: Krack on Aha: ‘ఆహా’లోనూ అదే జోరు.. ‘క్రాక్’ లేపుతోన్న రవితేజ.. పండుగ చేసుకుంటున్న మాస్ జనాలు