మే1న ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఎక్కడ..?

| Edited By:

Apr 24, 2019 | 1:28 PM

సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా తెరకెక్కింది ‘మహర్షి’. వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సిద్ధమైంది. మే 1వ తేదిన హైదరాబాద్‌ నెక్లస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ విషయాన్ని ప్రముఖ పీఆర్వో వంశీ కాకా సోషల్ మీడియాలో తెలిపారు. కాగా ఈ చిత్రంలో మహేశ్ […]

మే1న ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఎక్కడ..?
Follow us on

సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా తెరకెక్కింది ‘మహర్షి’. వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సిద్ధమైంది. మే 1వ తేదిన హైదరాబాద్‌ నెక్లస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ విషయాన్ని ప్రముఖ పీఆర్వో వంశీ కాకా సోషల్ మీడియాలో తెలిపారు.

కాగా ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. అల్లరి నరేశ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. సామాజిక సందేశంతో తెరకెక్కిన ఈ మూవీపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్‌ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఇక ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.