AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్‌కు ‘నో’.. మహేష్‌కు మరోసారి ‘ఓకే’..!

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వరుసగా మూడు చిత్రాల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ ‌రెండు సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటున్నారు. అందులో పింక్ రీమేక్‌ ఒకటి కాగా.. క్రిష్ దర్శకత్వంలో మరొకటి. చారిత్రాత్మక చిత్రంగా క్రిష్ మూవీ తెరకెక్కుతుండగా.. పండుగ సాయన్న పాత్రలో పవన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీలో హీరోయిన్‌గా కియారా అద్వానీని సంప్రదించిందట చిత్ర యూనిట్. అయితే ఈ ఆఫర్‌కు ఆమె నో చెప్పినట్లు తెలుస్తోంది. భరత్ అనే నేను చిత్రం ద్వారా […]

పవన్‌కు 'నో'.. మహేష్‌కు మరోసారి 'ఓకే'..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 10, 2020 | 7:10 PM

Share

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వరుసగా మూడు చిత్రాల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ ‌రెండు సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటున్నారు. అందులో పింక్ రీమేక్‌ ఒకటి కాగా.. క్రిష్ దర్శకత్వంలో మరొకటి. చారిత్రాత్మక చిత్రంగా క్రిష్ మూవీ తెరకెక్కుతుండగా.. పండుగ సాయన్న పాత్రలో పవన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీలో హీరోయిన్‌గా కియారా అద్వానీని సంప్రదించిందట చిత్ర యూనిట్. అయితే ఈ ఆఫర్‌కు ఆమె నో చెప్పినట్లు తెలుస్తోంది.

భరత్ అనే నేను చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కియారా.. ఆ తరువాత రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామలో నటించింది. ఆ తరువాత బాలీవుడ్‌లో వరుస అవకాశాలు రావడంతో.. అక్కడ బిజీబిజీగా గడిపేస్తోంది కియారా. ఈ క్రమంలో ఈ మధ్యన పవన్ సినిమా కోసం ఆమెను కలవగా.. వద్దని చెప్పినట్లు టాక్. అంతేకాదు విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్ సినిమాలకు కూడా కియారా నో చెప్పినట్లు టాక్ నడుస్తోంది. అయితే ఆసక్తికరంగా మహేష్ చిత్రానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మహేష్-వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతోన్న రెండో చిత్రంలో కియారా హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్లు టాక్. మరి మిగిలిన వారందరికీ నో చెబుతూ.. కేవలం మహేష్‌కు మాత్రమే కియారా ఓకే చెప్పడానికి గల కారణాలేంటో..? అన్న టాక్ ఫిలింనగర్‌లో నడుస్తోంది. కాగా దక్షిణాదిని మాత్రం వదిలేది లేదని.. సంవత్సరానికి ఒక్క సినిమా అయినా ఇక్కడ చేస్తానంటూ ఇటీవల కియారా ఓ సందర్భంలో వెల్లడించిన విషయం తెలిసిందే.