ప్రభాస్ ‘ఆదిపురుష్’‌.. సీతగా ఆ ఇద్దరిలో ఒకరు..!

ప్రభాస్‌తో ఓమ్‌ రౌత్‌ తెరకెక్కించనున్న పౌరాణిక చిత్రం 'ఆదిపురుష్‌'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు

ప్రభాస్ 'ఆదిపురుష్'‌.. సీతగా ఆ ఇద్దరిలో ఒకరు..!
Follow us

| Edited By:

Updated on: Nov 01, 2020 | 9:41 AM

Prabhas Adipurush movie: ప్రభాస్‌తో ఓమ్‌ రౌత్‌ తెరకెక్కించనున్న పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్‌’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటించనున్నారు. ఇక మిగిలిన పాత్రాధారులకు సంబంధించిన ఎంపిక ప్రస్తుతం జరుగుతోంది. అయితే ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇందులో కీలక పాత్రలైన సీత, హనుమంతుడు, లక్ష్మణుడు పాత్రలలో ఎవరు నటిస్తారన్న చర్చ జరుగుతూ వస్తోంది. (జగన్ చరిత్రలో నిలిచిపోతారు: ఆర్ కృష్ణయ్య ప్రశంసలు)

ఇక సీత పాత్రకు గానూ పలువురి పేర్లు వినిపించాయి. అనుష్క శర్మ, అనుష్క శెట్టి, ఊర్వతి రౌటెలా, కియారా అద్వానీ, శ్రద్ద కపూర్ ఇలా పలు హీరోయిన్ల పేర్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ పాత్రకు గానూ శ్రద్ద, కియారాలలో ఎవరో ఒకరిని తీసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే ప్రభాస్ సాహోలో శ్రద్దా ఆడిపాడింది. సినిమా ఫ్లాప్ అయినా అందులో వీరిద్దరి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. ఒకవేళ శ్రద్దకు ఈ అవకాశం వస్తే రెండోసారి ఈ జోడీని తెరపై చూడొచ్చు. ఇక కియారాను ఫైనల్ చేస్తే మొదటి సారి ఈ పెయిర్‌ కలిసి నటించనుంి. మరి ఇందులో నిజమెంత..? ప్రభాస్ ఆదిపురుష్‌లో సీత ఎవరు..? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా టీసిరీస్‌ నిర్మిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుండగా.. పలు భారతీయ భాషల్లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ( కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,416 కొత్త కేసులు.. 5 మరణాలు)