దాసరి కుమారుడు మిస్సింగ్..!

|

Jun 13, 2019 | 5:25 PM

దివంగత సినీ దర్శకుడు దాసరి నారాయణరావు కుమారుడు ప్రభు అదృశ్యమయ్యారు. జూన్ 9న ఇంటి నుంచి వెళ్లిన ఆయన మళ్ళీ తిరిగిరాలేదు. దీంతో ఆయన కుటుంబసభ్యులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇకపోతే 2008లో కూడా ప్రభు అదృశ్యం కాగా.. ఆ తర్వాత బయటికి వచ్చి భార్య సుశీల తనను కిడ్నాప్ చేసిందని ఆరోపించారు. వీరిద్దరి మధ్య ఎప్పటినుంచో ఆస్తి తగాదాలు ఉన్నట్లు సమాచారం. ఇక తాజాగా ప్రభు అదృశ్యానికి  కూడా ఆ వివాదమే కారణం అని […]

దాసరి కుమారుడు మిస్సింగ్..!
Follow us on

దివంగత సినీ దర్శకుడు దాసరి నారాయణరావు కుమారుడు ప్రభు అదృశ్యమయ్యారు. జూన్ 9న ఇంటి నుంచి వెళ్లిన ఆయన మళ్ళీ తిరిగిరాలేదు. దీంతో ఆయన కుటుంబసభ్యులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇకపోతే 2008లో కూడా ప్రభు అదృశ్యం కాగా.. ఆ తర్వాత బయటికి వచ్చి భార్య సుశీల తనను కిడ్నాప్ చేసిందని ఆరోపించారు. వీరిద్దరి మధ్య ఎప్పటినుంచో ఆస్తి తగాదాలు ఉన్నట్లు సమాచారం. ఇక తాజాగా ప్రభు అదృశ్యానికి  కూడా ఆ వివాదమే కారణం అని పోలీసులు భావిస్తున్నారు.