Bipasha Basu: కన్నుల పండువగా హీరోయిన్‌ సీమంతం.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న ఫొటోస్‌

బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ బిపాషా బసు (Bipasha Basu) త్వరలోనే తల్లిగా ప్రమోషన్‌ పొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీని ఎంజాయ్‌ చేస్తూ ఆ ఫొటోలను నిత్యం సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటూ మురిసిపోతుందీ ముద్దుగుమ్మ.

Bipasha Basu: కన్నుల పండువగా హీరోయిన్‌ సీమంతం.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న ఫొటోస్‌
Bipasha Basu

Updated on: Sep 11, 2022 | 10:55 AM

బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ బిపాషా బసు (Bipasha Basu) త్వరలోనే తల్లిగా ప్రమోషన్‌ పొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీని ఎంజాయ్‌ చేస్తూ ఆ ఫొటోలను నిత్యం సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటూ మురిసిపోతుందీ ముద్దుగుమ్మ. ఇటీవల భర్త కరన్‌ సింగ్ గ్రోవర్‌ (Karan Singh Grover) తో ఆమె తీసుకున్న మెటర్నిటీ ఫొటోషూట్‌ నెట్టింట్లో తెగ వైరలైంది. తాజాగా బిపాసా సీమంతం వేడుక వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా రెడ్ కలర్‌ ట్రెడిషనల్‌ శారీలో ఎంతో అందంగా ముస్తాబైంది బిపాసా. తన భర్తతో కలిసి రొమాంటిక్ పోజుల్లో ఫొటోలు దిగింది. అనంతరం వాటిని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. దీంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. సినీ ప్రముఖులు, ఫ్యాన్స్‌ బిపాసా దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా జిస్మ్‌, ధూమ్‌ సిరీస్‌ సినిమాల్లో అందాలు ఆరబోసి కుర్రకారు హృదయాల్లో కలకలం రేపింది బిపాసాబసు. హిందీలో ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. మహేశ్‌ బాబుతో కలిసి టక్కరి దొంగ సినిమాలో సందడి చేసిందీ బెంగాలీ బ్యూటీ. కాగా ఈ అందాల తార చివరిసారిగా 2015లో ఎలోన్‌ అనే సినిమాలో నటించింది. ఈ చిత్రంలో హీరోగా నటించిన కరణ్‌సింగ్ గ్రోవర్‌తో ప్రేమలో పడిందామె. కొన్ని నెలల పాటు డేటింగ్‌ చేసిన ఈ జోడీ 2016లో పెద్దల అనుమతితో కలిసి పెళ్లిపీటలెక్కారు. వారి ఆరేళ్ల ప్రేమానుబంధానికి ప్రతీకగా త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ పొందనున్నారు లవ్లీ కపుల్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us