‘కార్తికేయ 2’ నుంచి తప్పుకున్న అనుపమ.. రీజన్ అదేనా!

| Edited By:

Jun 04, 2020 | 7:05 PM

నిఖిల్‌ హీరోగా చందూ మొండేటి తెరకెక్కిస్తోన్న చిత్రం కార్తికేయ 2. 2014లో ఘన విజయం సాధించిన కార్తికేయ సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుండగా..

కార్తికేయ 2 నుంచి తప్పుకున్న అనుపమ.. రీజన్ అదేనా!
త్రివిక్రమ్ తెరకెక్కించిన అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ,మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్.
Follow us on

నిఖిల్‌ హీరోగా చందూ మొండేటి తెరకెక్కిస్తోన్న చిత్రం కార్తికేయ 2. 2014లో ఘన విజయం సాధించిన కార్తికేయ సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా మలయాళ కుట్టీ అనుపమ ఫైనల్ అయినట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. అయితే ఫిలింనగర్ వర్గాల తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ నుంచి ఈ భామ తప్పుకుందట.

ఈ సీక్వెల్‌కు సంబంధించిన స్టోరీ నెరేషన్‌ను చాలా రోజుల క్రితమే అనుపమకు కథను చెప్పిన చందూ మొండేటి.. తాజాగా పూర్తి స్క్రిప్ట్‌ను వినిపించారట. అయితే అందులో తన పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదని చెప్పిన అనుపమ.. ఈ ప్రాజెక్ట్‌లో తాను చేయలేనని చెప్పిందట. దీంతో టీమ్ మరో హీరోయిన్ కోసం వెతుకులాట ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాగా మొదటి భాగంలో నిఖిల్ వైద్య విధ్యార్థిగా కనిపించగా, రెండో భాగంలో డాక్టర్‌గా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన మోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్‌లు అందరినీ ఆకట్టుకోగా.. ఈ సీక్వెల్‌పై మంచి అంచనాలు ఉన్నాయి.

Read This Story Also: జార్జి ఫ్లాయిడ్‌కి కరోనా.. వెలుగులోకి కీలక విషయాలు..!