నిఖిల్కు హీరోయిన్ ఫిక్స్.. స్వాతి పాత్రలో కేరళ కుట్టీ..?
ఇటీవల ‘అర్జున్ సురవరం’తో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు యంగ్ హీరో నిఖిల్. ఈ మూవీ ఇచ్చిన విజయాన్ని ఇంకా ఎంజాయ్ చేస్తోన్న ఈ హీరో.. త్వరలో కార్తికేయ 2లో నటించబోతున్నాడు. చందూ మొండేటి దర్శకత్వం వహించబోతున్న ఈ మూవీకి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 2014లో విడుదలై ఘన విజయం సాధించిన కార్తికేయ సీక్వెల్గా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. కాగా ఈ మూవీ కోసం హీరోయిన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మలయాళ కుట్టీ, అందాల […]
ఇటీవల ‘అర్జున్ సురవరం’తో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు యంగ్ హీరో నిఖిల్. ఈ మూవీ ఇచ్చిన విజయాన్ని ఇంకా ఎంజాయ్ చేస్తోన్న ఈ హీరో.. త్వరలో కార్తికేయ 2లో నటించబోతున్నాడు. చందూ మొండేటి దర్శకత్వం వహించబోతున్న ఈ మూవీకి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 2014లో విడుదలై ఘన విజయం సాధించిన కార్తికేయ సీక్వెల్గా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. కాగా ఈ మూవీ కోసం హీరోయిన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మలయాళ కుట్టీ, అందాల భామ అనుపమను హీరోయిన్గా తీసుకోవాలని చందూ ఆలోచిస్తున్నాడట. దీనిపై ఆమెతో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది.
కార్తికేయలో స్వాతి రెడ్డి హీరోయిన్గా నటించగా.. ఆమె పాత్ర పక్కింటి అమ్మాయిలా తీర్చిదిద్దాడు చందూ. ఇక రెండో భాగంలోనూ హీరోయిన్ది అలాంటి పాత్రనే కాగా.. అందుకు అనుపమ సరిగ్గా సెట్ అవుతుందని దర్శకుడు భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ మలయాళ కుట్టీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు టాక్. అయితే చందూ మొండేటి దర్శకత్వం వహించిన ప్రేమమ్(మలయాళ ప్రేమమ్ రీమేక్)లో అనుపమ నటించిన విషయం తెలిసిందే. కాగా ఈ మూవీని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత..? కార్తికేయ 2 ఎప్పుడు ప్రారంభమవుతుంది..? అనే విషయాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.