
సినీ నటుడు ,రాజకీయ నాయకుడు మురళీ మోహన్ తన వ్యక్తిగత దైవభక్తి, ఆధ్యాత్మిక జీవనశైలి గురించి వెల్లడించారు. తన బాల్యం నుండే దైవభక్తి తన జీవితంలో భాగమైందని, చిన్నతనంలో తన తల్లి దేవుడికి దండం పెట్టుకోవాలని, పండగలప్పుడు పద్యాలు నేర్పేవారని గుర్తుచేసుకున్నారు. కాలేజీ చదువుల అనంతరం దేవుడి పట్ల తన భక్తి మరింత పెరిగిందని, వ్యాపారంలోకి వచ్చిన తర్వాత రోజువారీ పూజ క్రమం తప్పకుండా చేయడం ప్రారంభించానని తెలిపారు. ప్రస్తుతం తాను రోజుకు గంట, గంటన్నర పాటు పూజకు కేటాయిస్తానని వివరించారు. మురళీ మోహన్కు ప్రత్యేకంగా ఇష్టదైవం అంటూ ఏదీ లేదని, తాను అన్ని మతాలను, అన్ని దేవతలను గౌరవిస్తానని స్పష్టం చేశారు. మసీదులు, చర్చిలు, దేవాలయాలు కనిపించినప్పుడు తప్పకుండా నమస్కరించుకుంటానని తెలిపారు. వెంకటేశ్వరస్వామి తెలుగువారికి ఇలవేల్పు అని, సాయిబాబా, అయ్యప్ప స్వాములను కూడా తాను ఆరాధిస్తానని పేర్కొన్నారు. సూర్య భగవానుడిని ప్రత్యక్ష నారాయణుడిగా భావించి ప్రత్యేకంగా పూజిస్తానని, ఆరోగ్యం, జీవనం కోసం ఆయన ఆవశ్యకతను చెప్పారు.
ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..
మురళీ మోహన్ తన పూజా విధానంలో ఒక ప్రత్యేక క్రమశిక్షణను పాటిస్తారని వెల్లడించారు. సోమవారం శివపూజ, మంగళవారం ఆంజనేయస్వామి పూజ, బుధవారం అయ్యప్ప పూజ, గురువారం సాయిబాబా పూజ, శుక్రవారం అమ్మవారి పూజ, శనివారం వెంకటేశ్వరస్వామి పూజ, ఆదివారం సూర్యభగవానుడి పూజ చేస్తానని వివరించారు. ఇది ఒక టైమ్టేబుల్ లాగా తాను ఏర్పాటు చేసుకున్న విధానమని, ఆ రోజుకు సంబంధించిన దైవాన్ని ప్రత్యేకంగా పూజిస్తానని పేర్కొన్నారు. తన దైవభక్తి తనకు గొప్ప ఆత్మసంతృప్తిని అందించిందని మురళీ మోహన్ తెలిపారు. తాను ఏ పూజ చేసినా, “సమస్త లోకా సుఖినోభవంతు, సర్వేజనా సుఖినోభవంతు” అని ప్రార్థిస్తానని చెప్పారు. అయితే ఈ మధ్యకాలంలో తన ఆలోచనలో మార్పు వచ్చిందని, మనుషులు మాత్రమే కాదు, సృష్టిలోని జీవరాశులన్నీ బాగుండాలని కోరుకుంటూ “సమస్త జీవా సుఖినోభవంతు” అని కూడా ప్రార్థిస్తానని అన్నారు. ఈ ఆలోచన తనకే వచ్చిందని, ఇతరులు చెప్పింది కాదని ఆయన స్పష్టం చేశారు. తన పూజలు గురువు ఉపదేశం లేకుండా, మనస్ఫూర్తిగా చేసేవని, ఎవరైనా పెద్దలు చూస్తే నవ్వుతారేమో లేదా మెచ్చుకుంటారేమో అని చమత్కరించారు. దేవుడిని కోరికలు తీరిన తర్వాత మర్చిపోవడం సరైనది కాదని, ఆపద వచ్చినప్పుడే దేవుడు గుర్తుకురావడం సరికాదని అన్నారు.
ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..
ఈ సందర్భంగా నటుడు బాలకృష్ణ దైవ క్రమశిక్షణ గురించి మురళీ మోహన్ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. జై సింహా సినిమా షూటింగ్ సమయంలో కుంభకోణంలో ఉన్నప్పుడు బాలకృష్ణను దగ్గరగా గమనించానని తెలిపారు. తాను ఉదయం ఐదింటికి వాకింగ్కు వెళ్లడానికి లేచేసరికి, బాలకృష్ణ అప్పటికే వాకింగ్, జిమ్ పూర్తి చేసుకుని తన గదిలోకి వెళ్తుండేవారని పేర్కొన్నారు. తన వాకింగ్ పూర్తయ్యాక చూస్తే, బాలకృష్ణ దేవుడి దగ్గర కూర్చుని పూజ చేస్తూ కనిపించేవారని తెలిపారు. రేపు ఏడు గంటలకు వెళ్ళాలి అనుకుంటే, నాలుగింటికో మూడింటికో లేచి, తన పూజలను పూర్తి చేసుకుని, ఆరున్నర కల్లా బయలుదేరి వెళ్ళిపోతారని, ఆయనలో అంత క్రమశిక్షణ ఉందని మురళీ మోహన్ ప్రశంసించారు. దివంగత ఎన్.టి. రామారావు గారి నుండి ఆయన ఈ ప్రేరణ పొంది ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. బాలకృష్ణకు తిథులు, నక్షత్రాలు, మంచి చెడులు, ఏ రోజు ఏ దిశకు వెళ్ళాలి అనే విషయాలపై పూర్తి అవగాహన ఉందని, వాటిని ఆయన కచ్చితంగా పాటిస్తారని మురళీ మోహన్ వెల్లడించారు.
ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్గా, వాచ్మన్గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..
ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..