యంగ్ హీరో అల్లు శిరీష్ మలయాళ చిత్రం “ఎబిసిడి” రీమేక్లో నటించిన విషయం తెలిసిందే. నూతన దర్శకుడు సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను “పెళ్లిచూపులు” నిర్మాత యశ్ రంగినేని, మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జుడా స్యాండీ సంగీతాన్ని అందించారు. కృష్ణార్జున యుద్ధం చిత్రంలో కథానాయికగా నటించి మెప్పించిన రుక్సర్ థిల్లాన్ ఈ చిత్రంలో అల్లు శిరీష్కు జోడీగా మెరిసింది. మే 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో మూవీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ మూవీ శిరీష్కి మంచి హిట్ అందించడం ఖాయమని మూవీ టీం భావిస్తుంది. చాలా రోజుల తర్వాత మాస్టర్ భరత్ ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తుండగా .. నాగబాబు, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.