Goa Election 2022: స్వతంత్ర ఎమ్మెల్యే ప్రసాద్ గాంకర్ రాజీనామా.. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటన

|

Jan 09, 2022 | 8:24 PM

ఎన్నికలకు దాదాపు నెల రోజుల ముందు గోవా స్వతంత్ర ఎమ్మెల్యే ప్రసాద్ గాంకర్ ఆదివారం అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో పాటు తాను కాంగ్రెస్‌లో చేరతున్నట్లు ప్రకటించారు.

Goa Election 2022: స్వతంత్ర ఎమ్మెల్యే ప్రసాద్ గాంకర్ రాజీనామా.. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటన
Mla Prasad Gaonkar
Follow us on

MLA Prasad Gaonkar Resigned: ఎన్నికలకు దాదాపు నెల రోజుల ముందు గోవా స్వతంత్ర ఎమ్మెల్యే ప్రసాద్ గాంకర్ ఆదివారం అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో పాటు తాను కాంగ్రెస్‌లో చేరతున్నట్లు ప్రకటించారు. సంగం నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే తన రాజీనామాను గోవా శాసనసభ స్పీకర్‌కు సమర్పించారు. ఆయన రాజీనామాతో 40 మంది సభ్యులున్న శాసనసభలో బలం 33కి పడిపోయింది.

అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశానని ఆయన అన్నారు. సంగం నియోజక వర్గం నుంచి పోటీ చేసేందుకు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరతాను.’’ కోస్తా రాష్ట్రంలో ఫిబ్రవరి 14న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గత ఐదేళ్లలో, చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.

అంతకుముందు, కాంగ్రెస్‌కు చెందిన లుజిన్హో ఫలేరో, రవి నాయక్, స్వతంత్ర ఎమ్మెల్యే రోహన్ ఖుంటే, బీజేపీకి చెందిన అలీనా సల్దాన్హా, గోవా ఫార్వర్డ్ పార్టీకి చెందిన జయేష్ సల్గావ్కర్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి (ఎన్‌సిపి) చర్చిల్ అలెమావో అసెంబ్లీకి రాజీనామా చేశారు. ఫలీరో రాజీనామా చేసిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో చేరారు.

గత గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించి ఇప్పుడు కేవలం రెండు సీట్లకు పడిపోయింది. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్, గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ), మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), టీఎంసీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు పోటీలో ఉన్నాయి. రాష్ట్రంలో 11 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.

గోవాలోని అన్ని స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 14న జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ గోవా శాఖ అధ్యక్షుడు గిరీష్ చోడంకర్ శనివారం అన్నారు. రాష్ట్రంలోని మతతత్వ, అవినీతి బీజేపీ ప్రభుత్వాన్ని పార్టీ కార్యకర్తలు, ప్రజలు తరిమి కొట్టాలన్నారు. చోడంకర్ మాట్లాడుతూ.. జిల్లా పంచాయతీ ఎన్నికల సందర్భంగా బీజేపీ నిబంధనలను వక్రీకరించరాదని, ఇందులో కాంగ్రెస్ ఓటమిని చవిచూడాల్సి వచ్చిందన్నారు.

కాంగ్రెస్ తన అభ్యర్థుల రెండో జాబితాను ఆదివారం ప్రకటిస్తుందని, అందులో కూటమి భాగస్వామి గోవా ఫార్వర్డ్ పార్టీ పేర్లు కూడా ఉంటాయని ఆయన చెప్పారు. గోవా శాసనసభలోని మొత్తం 40 స్థానాలకు ఫిబ్రవరి 14న ఎన్నికలు జరుగుతాయని, మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం ముందుగా ప్రకటించింది. ప్రకటనతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది.

Read Also….  Warning: పదేళ్లుగా ప్రేమించి,పెళ్లి చేసుకున్న జంట.. చావు తప్పదంటూ ప్రముఖ నేత బెదిరింపులు!