AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య..!

కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కన్న బిడ్డలకు విషమిచ్చి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కొండపల్లిలో తీవ్ర కలకలం రేపింది. జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరు పిల్లలకు విషమిచ్చింది. అనంతరం తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య..!
Balaraju Goud
|

Updated on: Aug 23, 2020 | 4:27 PM

Share

కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కన్న బిడ్డలకు విషమిచ్చి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కొండపల్లిలో తీవ్ర కలకలం రేపింది. జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరు పిల్లలకు విషమిచ్చింది. అనంతరం తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొండపల్లిలో మూడేళ్ల బాబు, ఏడాది పాపతో కలిసి లావణ్య, నాగేశ్వర్‌రావు దంపతులు నివాసముంటున్నారు. అయితే, ఇంటి నుంచి లావణ్య బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా.. అపస్మారక స్థితిలో ఉన్న తల్లి, ఇద్దరు పిల్లల్ని స్థానికులు గుర్తించారు. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి రక్షించే ప్రయత్నం చేశారు. బాధితులను ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, వారిని చేర్చుకునేందుకు వైద్యులు నిరాకరించినట్లు సమాచారం. మరో హాస్పటల్‌కు తరలిస్తుండగా ముగ్గురు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. భర్త నాగేశ్వర్‌రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.