Hyderabad: చందానగర్‌లో విషాదం.. మహిళా న్యాయవాది ఆత్మహత్య.. భవనంపై నుంచి దూకి..

|

Apr 17, 2022 | 9:37 AM

Hyderabad News: హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ చందానగర్‌లో మహిళా న్యాయవాది ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున మహిళా న్యాయవాది

Hyderabad: చందానగర్‌లో విషాదం.. మహిళా న్యాయవాది ఆత్మహత్య.. భవనంపై నుంచి దూకి..
Shivani Suicide
Follow us on

Hyderabad News: హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ చందానగర్‌లో మహిళా న్యాయవాది ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున మహిళా న్యాయవాది శివాని భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి (Chandanagar) చేరుకొని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. కుటుంబ కలహాల కారణంగా శివాని ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం  చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భార్యభర్తల మధ్య తరచూ వివాదాలు జరిగేవని పేర్కొంటున్నారు. కాగా.. ఐదేళ్ల క్రితం అర్జున్‌తో శివానికి వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.

ఈ ఘటన అనంతరం మృతురాలి భర్త అర్జున్‌ చందానగర్‌ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు (Hyderabad Police) దర్యాప్తు జరుపుతున్నారు. భార్యభర్తల మధ్య వివాదాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. శివాని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Also Read:

కిచిడిలో ఉప్పు ఎక్కువైందని ఘాతుకం.. భార్యపై భర్త ఏం చేశాడో తెలుసా..?

Prabhas: ఆ కారు ప్రభాస్‌ది కాదట.. క్లారిటీ ఇచ్చిన రెబల్ స్టార్ పీఆర్ టీమ్.. అసలేమైందంటే..?