తాగుబోతు భర్త వేధింపులు తాళలేక…పిల్లలతో కలిసి దారుణం

తాగుబోతు భర్త వేధింపులు భరించలేక ఓ ఇల్లాలు తెగించింది. కన్నబిడ్డలతో కలిసి కట్టుకున్నవాడిని కడతేర్చింది. తాగిన మైకంలోనే తన భర్త చనిపోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నించింది. కానీ,..

తాగుబోతు భర్త వేధింపులు తాళలేక...పిల్లలతో కలిసి దారుణం

Updated on: Jul 25, 2020 | 12:20 PM

తాగుబోతు భర్త వేధింపులు భరించలేక ఓ ఇల్లాలు తెగించింది. కన్నబిడ్డలతో కలిసి కట్టుకున్నవాడిని కడతేర్చింది. తాగిన మైకంలోనే తన భర్త చనిపోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నించింది. కానీ, అనుమానం వచ్చిన మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అసలు విషయం బయటపెట్టారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని మల్కాపూర్‌కు చెందిన ఓ దంపతులు రోజూ కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. కాగా, ఆ వ్యక్తి గత కొంతకాలంగా తాగుడుకు బానిసగా మారాడు. రోజూ తాగుతూ ఇంట్లో భార్య పిల్లలతో తరచూ గొడవలు పడుతుండే వాడు. తాగిన మైకంలో తండ్రి చేస్తున్న రచ్చను అతడి భార్య పిల్లలు భరించలేక పోయేవారు. ఈ క్రమంలోనే మొన్న ఒకరోజు పీకలదాకా తాగేసి వచ్చి ఇంట్లో గొడవపడ్డాడు. దీంతో ముగ్గురూ కలిసి అతడి మెడకు తాడు బిగించి ఉరివేసి చంపేశారు. నిద్రలోనే చనిపోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసినట్లుగా పోలీసుల నిర్ధారించారు. భార్య పిల్లలను అదుపులోకి తీసుకుని విచారించగా జరిగిన విషయం బయటపడింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us