Road Accident: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి.. 40 మందికి గాయాలు

Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఏపీలోని అల్లూరిసీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ..

Road Accident: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి.. 40 మందికి గాయాలు
Road Accident

Edited By:

Updated on: Jun 13, 2022 | 6:46 PM

Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఏపీలోని అల్లూరిసీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడి ఐదుగురు మృతి చెందగా, 40 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు హుటహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒడిశా భవానీపట్నం నుంచి విజయవాడకు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందగా మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మృతులు ధనేశ్వర్‌ దళపతి(24), జీతు హరిజన్‌(5), సునేనా హరిజన్‌(2) కాగా మరో ఇద్దరు ఉన్నారు.

డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే..

ఇవి కూడా చదవండి

బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను ఒడిశాలోని స్వస్థలానికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us