యూపీలో మరో దారుణం ః ముగ్గురు అక్కాచెల్లెళ్లపై యాసిడ్‌ దాడి

|

Oct 13, 2020 | 1:43 PM

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.. గోండా జిల్లాలో నిన్న రాత్రి నిద్రిస్తున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లపై గుర్తు తెలియని వ్యక్తి ఒకడు యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు..

యూపీలో మరో దారుణం ః ముగ్గురు అక్కాచెల్లెళ్లపై యాసిడ్‌ దాడి
acid attack incident in medak district
Follow us on

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.. గోండా జిల్లాలో నిన్న రాత్రి నిద్రిస్తున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లపై గుర్తు తెలియని వ్యక్తి ఒకడు యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు..ఈ దాడిలో మైనర్‌ బాలికలైన ఆ ముగ్గురూ గాయపడ్డారు.. దళిత సామాజికవర్గానికి చెందిన ఈ బాధితుల వయసు వరుసగా 8,12,17 సంవత్సరాలు ఉంటాయి.. ఇద్దరికి కాలిన గాయాలయ్యాయి.. మరొ బాలిక ముఖంపై యాసిడ్‌ పడటంతో తీవ్రంగా గాయపడింది.. ఈ ముగ్గురుని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. గోండా పోలీసులు ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు కానీ దర్యాప్తు అయితే కొనసాగుతోంది.. హాథ్రస్‌లో జగిగిన దారుణ ఘటనను మర్చిపోకముందే గోండాలో ఈ సంఘటన జరగడం అత్యంత బాధాకరం.