Haryana Gang: ఏటీఎంలో చోరీలకు పాల్పడుతున్న హర్యానా గ్యాంగ్‌.. కూపీలాగుతున్న పోలీసులు..

|

Oct 03, 2021 | 1:22 PM

సరిహద్దు జిల్లాలే వారి టార్గెట్‌.. ఏటీఎం మెషీన్లను పగులగొట్టి భారీగా నగదు చోరీ..ఎస్‌. తమిళనాడు, ఆంద్ర, కర్ణాటక సరిహద్దు జిల్లాలైన తిరువళ్లూరు, అరకోణం..

Haryana Gang: ఏటీఎంలో చోరీలకు పాల్పడుతున్న హర్యానా గ్యాంగ్‌.. కూపీలాగుతున్న పోలీసులు..
Haryana Gang
Follow us on

సరిహద్దు జిల్లాలే వారి టార్గెట్‌.. ఏటీఎం మెషీన్లను పగులగొట్టి భారీగా నగదు చోరీ..ఎస్‌. తమిళనాడు, ఆంద్ర, కర్ణాటక సరిహద్దు జిల్లాలైన తిరువళ్లూరు, అరకోణం, ఉమ్మడి వెల్లూరు జిల్లాల్లో వరుస దోపిడీలతో హడలెత్తిస్తోంది ఓ గ్యాంగ్‌. గత కొంతకాలంగా ఏటీఎం మెషీన్లను పగులగొట్టి లక్షల రూపాయలు దోచుకుంది. దీంతో స్థానికులిచ్చిన ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు..ఈ ముఠాపై నిఘా పెట్టారు.

ఈ మూడు జిల్లాల్లో జరిగిన ఏటీఎం దోపిడీలకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌ను అన్ని జిల్లాలకు పంపించి అప్రమత్తం చేశారు. వాటి ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు..హర్యానా గ్యాంగే ఈ దోపిడీలకు పాల్పడుతున్నట్టు నిర్థారించారు.

వారిని పట్టుకునేందుకు 5 బృందాలను ఏర్పాటుచేశారు. చివరికి తిరువళ్లూరు జిల్లా ఎలావుర్‌ చెక్‌ పోస్ట్‌ సమీపంలో హర్యానా గ్యాంగ్‌ను అరెస్ట్‌ చేశారు. సాజిద్‌ హర్షద్‌తో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Maharashtra NCB Raid: వీకెండ్‌ మత్తు మజాలో వాణిజ్య నగరం.. పట్టుబడిన బాలీవుడ్‌ స్టార్‌ హీరో పుత్రరత్నం..