Andhra Pradesh News: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 6గురు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పూతలపట్టు మండలం లక్ష్మయ్య ఊరు వద్ద అదుపు తప్పి ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ట్రాక్టర్లో ఐరాల మండలం జంగాలపల్లి ఎస్సీ కాలనీకి చెందిన పెళ్లి బృందం ప్రయాణిస్తుంది.
పెళ్లి బృందంలోని ముగ్గురు మహిళలు, ఇద్దరు పిల్లలతో పాటు ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందారు. కాగా, ఈ ట్రాక్టర్లో మొత్తం 25మంది పెళ్లి బృందం ప్రయాణిస్తోంది. ఈ ప్రమాదంలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
వీరిని చిత్తూరు జిల్లా ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..