Murder In Kurnool District: కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆదోనిలో పరువు హత్య జరిగింది. ఆడమ్ స్మిత్ అనే వ్యక్తిని దుండగులు బండరాయితో మోది దారుణంగా హత్య చేశారు. నందవరం మండలం గురజాల గ్రామానికి చెందిన ఆడమ్స్మిత్ ఆర్ఎంపీ వైద్యుడిగా పని చేస్తున్నాడు. అయితే నెలన్నర రోజుల కిందట అదే గ్రామానికి చెందిన మళ్లీశ్వరిని ప్రేమించిపెళ్లి చేసుకున్నాడు.
వివాహం అయినప్పటి నుంచి ఆదోని విట్టా కిష్టప్ప నగర్లో ఉంటున్న వైద్యుడి .. ఆదోనిలోని ఓ నర్సింగ్ హోంలో పని చేస్తున్నాడు. రోజువారీగా ఆడమ్ స్మిత్ బైక్పై నర్సింగ్ హోంకు వెళ్తుండగా, కొందరు దుండగులు అటకాయించి బండరాయితో తలపై మోది హత్య చేశారు. కాగా, ప్రేమ వివాహం చేసుకున్నామనే కారణంతో భర్తను నా కుటుంబ సభ్యులే హత్య చేశారని మళ్లీశ్వరి ఆరోపిస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.