AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మతిస్థిమితం లేని మైనర్‌ బాలికపై టైలర్ ఘాతుకం

మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. వరుస సంఘటనలు మరువక ముందే ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. కేబినెట్ సాక్షిగా ప్రభుత్వం దిశా చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లుగా ప్రకటించింది. ప్రకటన వెలువడి 24 గంటలు దాటకుండానే చిత్తూరు జిల్లాలో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. మతిస్థిమితం లేని మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేశాడు. ఎస్‌ఆర్‌పురం మండలం, పుల్లూరు క్రాస్ రోడ్డు వద్ద ఈ ఘటన జరిగింది. మతిస్థిమితంలేని బాలిక సోదరుడితో కలసి టైలరింగ్ షాప్‌కు వెల్లింది. టైలరింగ్ షాప్ వద్ద […]

మతిస్థిమితం లేని మైనర్‌ బాలికపై టైలర్ ఘాతుకం
Girl-Rape
Pardhasaradhi Peri
|

Updated on: Dec 12, 2019 | 7:30 PM

Share

మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. వరుస సంఘటనలు మరువక ముందే ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. కేబినెట్ సాక్షిగా ప్రభుత్వం దిశా చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లుగా ప్రకటించింది. ప్రకటన వెలువడి 24 గంటలు దాటకుండానే చిత్తూరు జిల్లాలో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. మతిస్థిమితం లేని మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేశాడు. ఎస్‌ఆర్‌పురం మండలం, పుల్లూరు క్రాస్ రోడ్డు వద్ద ఈ ఘటన జరిగింది.

మతిస్థిమితంలేని బాలిక సోదరుడితో కలసి టైలరింగ్ షాప్‌కు వెల్లింది. టైలరింగ్ షాప్ వద్ద బాలికను సోదరుడు వదలి పెట్టి పనిమీద బయటకు వెళ్లాడు. ఆ తర్వాత టైలర్ బాబు అనే 42 ఏళ్ల వ్యక్తి బాలికకు మాయ మాటలు చెప్పి మిద్దిపైకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అప్పటికే ఆమె సోదరుడు అక్కడికి చేరుకోవడంతో విషయం బయట పడింది. దీంతో ఆగ్రహించిన బాలిక సోదరుడు టైలర్ బాబును చితక్కొట్టి పోలీసులకు అప్పగించాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికను వైద్య పరీక్షలు నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.