దారుణం.. 9 ఏళ్ల దత్తపుత్రికపై దంపతుల చిత్ర హింసలు.. ప్రైవేటు భాగాలపై కాలిన గాయాలు!

|

Jul 27, 2022 | 11:10 AM

దేశంలో దారుణాలు పెరిగిపోతున్నాయి. మానవత్వం మంటగలిసిపోతోంది. సొంత పిల్లలనే హింసలకు గురి చేస్తున్న ఘననలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో దారుణం..

దారుణం.. 9 ఏళ్ల దత్తపుత్రికపై దంపతుల చిత్ర హింసలు.. ప్రైవేటు భాగాలపై కాలిన గాయాలు!
Follow us on

దేశంలో దారుణాలు పెరిగిపోతున్నాయి. మానవత్వం మంటగలిసిపోతోంది. సొంత పిల్లలనే హింసలకు గురి చేస్తున్న ఘననలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇండోర్‌ జిల్లాలో ఒక జంట తమ 9 ఏళ్ల దత్తపుత్రికను చిత్రహింసలకు గురి చేసింది. ఈ బాలిక కాళ్లకు వాతలతో హింసకు గురి చేశారు. ఈ విషయమై పోలీసులకు తెలియడంతో ఈ దంపతులను అరెస్టు చేశారు. మంచాన్ని నీటితో తడిపినందున తన ప్రైవేటు భాగాలపై చిత్ర హింసలకు గురి చేశారని ఆమె ఆరోపించింది. సదరు పెంచుకుంటున్న తండ్రి కూడా బాలికపై దారుణంగా దాడి చేసినట్ఉల ఎంఐజీ పోలీసులు తెలిపారు. నిందితులై దంపతులకు బాలికకు దగ్గరి బంధుత్వం ఉంది. పీటీఐలోని నివేదిక ప్రకారం.. సదరు బాలిక తల్లిదండ్రులు కోవిడ్‌ కారణంగా మరణించారు. దీంతో దగ్గరి బంధుత్వం ఉన్న దంపతులు బాలికను దత్తత తీసుకున్నారు.

ఇదిలా ఉండగా, పోలీసులు నిందితులపై సెక్షన్‌ 294, 323, 324, 326-A, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. వీరిని కోర్టులో హాజరు పర్చిన అనంతరం జ్యుడీషియల్‌ కస్టడికి పంపినట్లు పోలీసు స్టేషన్‌ ఇన్‌చార్జీ అజయ్‌ వర్మ తెలిపారు. ప్రస్తుతానికి బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అధికారులు. బాలిక ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసిన తర్వాత మంచి కుటుంబం దత్తత తీసుకునేలా చూస్తామని అధికారులు తెలిపారు. చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటి (CWC) చైర్‌పర్సన్‌ పల్లవి పోర్వాల్‌ కూడా బాలిక ప్రైవేటు భాగాలపై కాలిన గాయాలున్నట్లు ధృవీకరించారు. ఆమె తలపై కొన్ని వెంట్రుకలు కాలినట్లు గుర్తించారు. అలాగే బాలిక శరీరంపై చేతి వేళ్ల గుర్తులను గుర్తించినట్లు చెప్పారు. బాలికను ఇంత చిత్రహిసలకు గురిచేసిన వారికి కఠినంగా శిక్షించేలా చర్యలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. బాలికకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి