Accident in Kamareddy : కామారెడ్డి జిల్లాలో లారీ డ్రైవర్ బీభత్సం.. వెనక నుంచి ఆటోను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి10 మందికి గాయాలు

|

Jun 14, 2021 | 8:46 AM

Accident in Kamareddy : లారీ డ్రైవర్ అతి వేగం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం

Accident in Kamareddy : కామారెడ్డి జిల్లాలో లారీ డ్రైవర్ బీభత్సం.. వెనక నుంచి ఆటోను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి10 మందికి గాయాలు
Accident In Kamareddy
Follow us on

Accident in Kamareddy : లారీ డ్రైవర్ అతి వేగం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం పద్మాజివాడి గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ వెనక నుంచి ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు మహిళలు మృతిచెందగా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ ఆగకుండా వెళ్లిపోవడంతో లారీ వెనకవైపు చిక్కుకున్న మహిళను రెండు కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంగోజివాడి గ్రామానికి చెందిన గడ్డం మమత, గడ్డం లక్ష్మితో పాటు మరి కొందరు నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలం కులాస్‌పూర్‌ గ్రామంలో జరిగిన అంత్యక్రియలకు రెండు ఆటోలు, ఒక తుఫాన్‌ వాహనంలో వెళ్లారు.

తిరుగు ప్రయాణంలో పద్మాజివాడి గ్రామ శివారులోకి రాగానే వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ వీరు ప్రయాణిస్తున్న ఓ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలోనుంచి గడ్డం మమత రోడ్డుపై పడిపోగా, ఆమె తలపై నుంచి లారీ వెనుక టైర్లు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. లారీ డ్రైవర్‌ ఆపకుండా వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. అదే ఆటోలో ఉన్న గడ్డం లక్ష్మి లారీ వెనుక భాగంలో ఇరుక్కుపోగా, సుమారు రెండు కిలోమీటర్ల వరకు రహదారి వెంట ఈడ్చుకెళ్లడంతో ఆమె కూడా దుర్మరణం చెందింది. లారీ డ్రైవర్‌ నేరుగా సదాశివనగర్‌ పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలిసింది. ఈ ఘటనలో మరో పదిమంది గాయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Mass Rape of a Dumb Girl : వరంగల్ జిల్లాలో దారుణ ఘటన.. మూగ యువతిపై సామూహిక అత్యాచారం..

Man Bring Snake to Hospital : కాటేసిన పాముతో ఆస్పత్రికి వచ్చిన యువకుడు..! హడలిపోయిన డాక్టర్లు..

తలకు రుమాలు.. మెడలో టవల్.. మారువేషంలో నేరగాళ్లకు చెక్ పెడుతున్న పోలీసులు..! ఎక్కడో తెలుసా..!