Acid Attack: యువకుడిపై యాసిడ్‌ దాడి చేసిన ఇద్దరు పిల్లల తల్లి..! ఎందుకో తెలుసా..?

|

Nov 21, 2021 | 6:06 AM

Acid Attack: కేరళలోని ఇడుక్కి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి చేసుకోను అన్నందుకు ఓ ఇద్దరు పిల్లల తల్లి ఓ యువకుడిపై యాసిడ్‌ దాడికి పాల్పడింది. దీంతో అతడు

Acid Attack: యువకుడిపై యాసిడ్‌ దాడి చేసిన ఇద్దరు పిల్లల తల్లి..! ఎందుకో తెలుసా..?
Arrest
Follow us on

Acid Attack: కేరళలోని ఇడుక్కి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి చేసుకోను అన్నందుకు ఓ ఇద్దరు పిల్లల తల్లి ఓ యువకుడిపై యాసిడ్‌ దాడికి పాల్పడింది. దీంతో అతడు ఇప్పుడు చూపు కోల్పోయే ప్రమాదంలో ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరుణ్ కుమార్ అనే వ్యక్తికి ఫేస్‌బుక్‌ ద్వారా ఒక మహిళ పరిచయం అయింది. అయితే ఆ మహిళకు పెళ్లయిందని, ఇద్దరు పిల్లలకు తల్లి అని తర్వాత తెలిసింది. దీంతో ఆమెతో ఉన్న సంబంధాన్ని అతడు క్లోజ్‌ చేయాలనుకున్నాడు.

అయితే సదరు మహిళ ఆ యువకుడిని బ్లాక్‌ మెయిల్ చేసింది. అతడి దగ్గరి నుంచి డబ్బులు డిమాండ్‌ చేసింది. దీంతో ఆ యువకుడు ఒక స్నేహితుడితో కలిసి నవంబరు 16న ఆదిమాలిలోని ఓ చర్చి సమీపంలో మహిళకు డబ్బులు ఇచ్చేందుకు వెళ్లాడు. చర్చి ఆవరణలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలో అరుణ్ కుమార్ వెనుక ఆ మహిళ నిలబడి ఉంది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఆమె ఒక్కసారిగా ముందుకు వచ్చి అతని ముఖంపై యాసిడ్ పోసింది. ఈ క్రమంలో ఆమెకు కూడా స్వల్ప గాయాలయ్యాయి.

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సదరు మహిళను అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఆ యువకుడు రాష్ట్ర రాజధానిలోని మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. అతడు కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీలో ఇదే నెలలో పెళ్లయిన యువతిపై ఓ వ్యక్తి యాసిడ్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడికి ఉరిశిక్ష వేయాలని బాధిత మహిళ భర్త డిమాండ్ చేస్తున్నాడు. బవానా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.

Indian Railway: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. చింతించకండి ఇకనుంచి ఆ సేవలు యధావిధిగా ప్రారంభం..

Viral Video: రైలు పట్టాలపై కుందేలు.. వెనుకనే దూసుకొచ్చిన మృత్యువు.. చివరకు ఎం జరిగిందంటే..?

ఈ నెలలో విడాకులు ఎక్కువగా తీసుకుంటున్నారట..! కారణాలు ఏంటో తెలుసా..?