AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేరళ గోల్డ్ స్కాం: శివశంకర్‌ను విచారించిన ఎన్ఐఏ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్కాం కేసులో నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ దూకుడు పెంచారు. ఈ కేసులో ప్రధాన నిందితులు స్వప్నా సురేష్ , సందీప్ నాయర్ ను ఇప్పటికే అరెస్ట్ చేసి విచారించిన ఎన్ఐఏ.. తాజాగా సీఎం మాజీ ముఖ్య కార్యదర్శి ఎం శివశంకర్‌ని ప్రశ్నిస్తోంది

కేరళ గోల్డ్ స్కాం: శివశంకర్‌ను విచారించిన ఎన్ఐఏ
Balaraju Goud
|

Updated on: Jul 23, 2020 | 5:30 PM

Share

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్కాం కేసులో నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ దూకుడు పెంచారు. ఈ కేసులో ప్రధాన నిందితులు స్వప్నా సురేష్ , సందీప్ నాయర్ ను ఇప్పటికే అరెస్ట్ చేసి విచారించిన ఎన్ఐఏ.. తాజాగా సీఎం మాజీ ముఖ్య కార్యదర్శి ఎం శివశంకర్‌ని ప్రశ్నిస్తోంది. అతని నుంచి కొన్ని వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది. స్మగ్లింగ్ వెనుక ఉన్నతస్థాయి అధికారుల పాత్రపై ఎన్ఐఏ ఆరా తీసినట్లు సమాచారం. మరోవైపు గోల్డ్ హవాలాలో నగదు చెల్లింపులు హైదరాబాద్ లో జరిగినట్లు కష్టమ్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హవాలా డబ్బును హైదరాబాద్ నుంచి దుబాయ్ కి తరలించినట్లు ఆధారాలు లభించినట్టు తెలిసింది.

కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలు స్వప్న సురేష్‌ను (ఎన్ఐఏ) జూలై 11న అరెస్టు చేసింది. స్వప్న సురేష్‌తో పాటు సందీప్ నాయర్ అనే మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) కాన్సులేట్‌కు చెందిన పార్శిల్లో రూ.15 కోట్ల విలువైన 30 కిలోల బంగారాన్ని జులై 4న విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాన్సులేట్‌కు సంబంధించిన పార్శిల్లో భారీగా బంగారం పట్టుబడటం కేరళలో కలకలం సృష్టించింది. ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించారు. ఈ వ్యవహారంలో యూఏఈ కాన్సులేట్ ఉద్యోగితో పాటు కేరళ ప్రభుత్వ ఐటీ శాఖలో పనిచేస్తున్న స్వప్న సురేశ్.. కేరళ సీఎం కార్యాలయ ప్రధాన కార్యదర్శి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.