Hyderabad: పబ్‌కు వెళ్లిన యువతిపై అత్యాచారం.. ఇంటికి వస్తుండగా కారులో ఎక్కించుకొని..

ఈ ఘటనలో యువతి (17) పై అత్యాచారం జరిగినట్లు భరోసా కేంద్రం అధికారులు నిర్ధారించారు. ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Hyderabad: పబ్‌కు వెళ్లిన యువతిపై అత్యాచారం.. ఇంటికి వస్తుండగా కారులో ఎక్కించుకొని..
Rape Case

Updated on: Jun 03, 2022 | 2:55 PM

Hyderabad Gangrape Case: హైదరాబాద్ నగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్‌ పరిధిలో ఓ పబ్‌కు వెళ్లిన యువతిపై కొందరు యువకులు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. సంచలనంగా మారిన ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. అయితే.. ఈ ఘటనలో యువతి (17) పై అత్యాచారం జరిగినట్లు భరోసా కేంద్రం అధికారులు నిర్ధారించారు. ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పబ్‌కు వెళ్లిన యువతిని ఇంటి వద్ద డ్రాప్‌ చేస్తామంటూ కొంతమంది యువకులు కారులో తీసుకెళ్లారు. అనంతరం కారులోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

కాగా.. యువతి మెడపై గాయాలను గమనించిన తల్లిదండ్రులు ఆమెను ప్రశ్నించారు. దీంతో ఆ యువతి.. కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించినట్లు తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆమె తండ్రి హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఈ ఘటనకు పాల్పడిన నిందితుల్లో ప్రజాప్రతినిధుల కుమారులు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన శనివారం జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులంతా విద్యార్థులుగా పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us