136 కేజీల వెండి సీజ్‌

| Edited By: Srinu

Dec 07, 2019 | 8:06 PM

జగిత్యాల జిల్లాలో భారీగా వెండి పట్టుబడింది. వాహన తనిఖీల్లో భాగంగా జగిత్యాల చివరులో సోదాలు చేపట్టిన అధికారులు పెద్ద మొత్తంలో వెండి, నగదును స్వాధీనం చేసుకున్నారు జిగిత్యాల సీసీఎస్‌ పోలీసులు. తమిళనాడు పేరిట రిజిస్ట్రర్‌ చేయబడిన స్విఫ్ట్ డిసైర్  కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకుల వద్ద 136 కేజీల వెండి, రూ. 10లక్షల నగదు పట్టుబడినట్లుగా సీసీఎస్‌ పోలీసులు తెలిపారు. పట్టుబడిన వెండికి ఎటువంటి దృవీకరణ పత్రాలు లేకపోవడంతో అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు కేసు నమోదు […]

136 కేజీల వెండి సీజ్‌
Follow us on

జగిత్యాల జిల్లాలో భారీగా వెండి పట్టుబడింది. వాహన తనిఖీల్లో భాగంగా జగిత్యాల చివరులో సోదాలు చేపట్టిన అధికారులు పెద్ద మొత్తంలో వెండి, నగదును స్వాధీనం చేసుకున్నారు జిగిత్యాల సీసీఎస్‌ పోలీసులు. తమిళనాడు పేరిట రిజిస్ట్రర్‌ చేయబడిన స్విఫ్ట్ డిసైర్  కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకుల వద్ద 136 కేజీల వెండి, రూ. 10లక్షల నగదు పట్టుబడినట్లుగా సీసీఎస్‌ పోలీసులు తెలిపారు. పట్టుబడిన వెండికి ఎటువంటి దృవీకరణ పత్రాలు లేకపోవడంతో అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల అదుపులో ఉన్న నలుగురు యువకులు శివానందం, మయువాల్‌, అర్జునన్‌, సుందర్‌రాజన్‌గా తెలిపారు.