Family Sucide: మంచిర్యాలలో విషాదం.. అప్పుల బాధతో ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య

|

Mar 25, 2021 | 9:30 AM

Family Members Sucide: తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

Family Sucide: మంచిర్యాలలో విషాదం.. అప్పుల బాధతో ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య
Family Sucide
Follow us on

Family Members Sucide: తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండలం మల్కపల్లిలో గురువారం జరిగింది. అప్పుల బాధలు భరించలేక కొడుకు, కూతురికి విషమిచ్చి దంపతులిద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జంజిరాల రమేశ్‌ (40), పద్మ (35) దంపతులు ఓ గదిలో, కుమారుడు అక్షయ్‌ (17), కుమార్తె సౌమ్య (19), మరో గదిలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇటీవలే కుమార్తె అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చింది. అయితే రమేష్.. కూతురు సౌమ్యకు ఏడాది క్రితమే హాజీపూర్ మండలం రాపెల్లికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ క్రమంలోనే అప్పులు బాధలు పెరగడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఘటనా స్థలంలో లేఖ లభ్యం..
సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఇంట్లో ఓ లేఖను గుర్తించారు. అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రమేష్ లేఖ రాశాడు. కొన్నాళ్ళుగా రమేష్ భూములు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు.. ఈ క్రమంలో అప్పులు పెరగడంతో ఇంటిల్లిపాది ఆత్మహత్యచేసకున్నట్లు సమాచారం. పోలీసులు మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్ుల కాసిపేట పోలీసులు తెలిపారు. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Also Read: