Facebook alerts Delhi Police: ఆ యూజర్ చనిపోతున్నాడు.. అమెరికా నుంచి ఫేస్‌బుక్ అలెర్ట్.. ఆ తర్వాత..

|

Jun 06, 2021 | 8:06 AM

Facebook alerts Delhi Police: భార్యను కోల్పోయి మానసికంగా బాధపడుతున్న ఓ 39 ఏళ్ల వ్యక్తి చనిపోదామనుకున్నాడు. ఈ ఘటనను ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమ్ చేద్దామనుకున్నాడు. దీంతో వెంటనే అమెరికాలోని ఫేస్‌బుక్ కార్యాలయం

Facebook alerts Delhi Police: ఆ యూజర్ చనిపోతున్నాడు.. అమెరికా నుంచి ఫేస్‌బుక్ అలెర్ట్.. ఆ తర్వాత..
Facebook
Follow us on

Suicide Attempt – Facebook alerts Delhi Police: భార్యను కోల్పోయి మానసికంగా బాధపడుతున్న ఓ 39 ఏళ్ల వ్యక్తి చనిపోదామనుకున్నాడు. ఈ ఘటనను ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమ్ చేద్దామనుకున్నాడు. దీంతో వెంటనే అమెరికాలోని ఫేస్‌బుక్ కార్యాలయం అప్రమత్తమైంది. వెంటనే ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించి అప్రమత్తం చేసింది. దీంతో హుటాహుటిన స్పందించిన ఢిల్లీ పోలీసులు ఆ సదరు వ్యక్తి ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకొని ప్రాణాలను కాపాడారు. ద్వారకాలోని పాలెంలో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన వివరాలను పోలీసులు శనివారం వెల్లడించారు.

దక్షిణ ఢిల్లీ ద్వారక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి స్వీట్‌ షాప్‌ ఉంది. అతనికి ఇద్దరు పిల్లలు. నాలుగేళ్ల క్రితం భార్య మరణించింది. అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయి ఎప్పుడూ కూడా ఏదో ఆలోచనలో ఉంటూ గడిపేవాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తి రెండు రోజుల క్రితం పొరుగువారితో గొడవపడ్డాడు. దాంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందామని భావించాడు. దీనిని ఫేస్‌బుక్‌లో లైవ్‌ స్ట్రీమ్‌ చేయాలని భావించాడు. లైవ్‌ ఆన్‌ చేసి చేతి మీద కత్తితో కోసుకున్నాడు. ఆ వ్యక్తి ప్రయత్నాన్ని అమెరికాలోని ఫేస్‌బుక్‌ కార్యాలయం అధికారులు గుర్తించారు. ఓ మేల్‌ ఫేస్‌బుక్‌ యూజర్‌ ఏదో అపాయకరమైన పని చేయబోతున్నాడని గుర్తించి వెంటనే ఢిల్లీ పోలీసులను అలర్ట్‌ చేశారు.

ఢిల్లీ పోలీసులు నోడల్‌ సైబర్‌ యూనిక్‌కు చెందిన సైబర్ ప్రివెన్షన్ అవేర్‌నెస్ అండ్ డిటెక్షన్ (సైపాడ్), సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ల మధ్య ఏర్పాటు చేసిన కోఆర్డినేషన్‌ ఫ్రేమ్‌ వర్క్‌ ద్వారా ఫేస్‌బుక్‌ అధికారులు ఢిల్లీ పోలీసులను అలర్ట్‌ చేయగలిగారు. వెంటనే సైపాడ్‌ అధికారులు ఈ సమాచారాన్ని ఆ వ్యక్తి ఇంటికి సమీపంలో ఉన్న అత్యవసర వాహన ఇన్‌ఛార్జి ప్రొబేషనర్‌ ఎస్పై అమిత్‌ కుమార్‌కు అందజేశారు. దీంతో వారు ఆ అడ్రెస్‌కు వెళ్లి తలుపులు పగులగొట్టి చూశారు.

అప్పటికే రక్తపు మడుగులో ఉన్న ఆ వ్యక్తిని సమీప ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించి.. ఆ తర్వాత ఏయిమ్స్‌ ట్రామా సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి స్థిరంగా ఉందని సైపాడ్ డీసీపీ అనైష్ రాయ్ తెలియజేశారు. తమకు ఫేస్ బుక్ కార్యాలయం నుంచి 12.50 నిమిషాలకు ఫోన్ వచ్చిందని.. ఆ వెంటనే స్పందించి గంటలోనే అతన్ని రక్షించామని ఆయన వెల్లడించారు.

Also Read:

SI Suicide: పని ఒత్తిడి.. స్టేషన్‌లోనే సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్న ఎస్ఐ

Golden Idol: మల్లన్న కలలో కనిపించాడంటూ పొలంలో తవ్వకాలు.. బంగారు విగ్రహం లభ్యం.. ఆపై