హాలీవుడ్ స్టైల్‌లో చోరీ.. లలితా జ్యూవెలరీలో ఆ రాత్రి ఏం జరిగింది..?

| Edited By:

Oct 03, 2019 | 12:32 PM

ఆ దొంగలు చేసిన చోరీ చూస్తే.. వాళ్లు హాలీవుడ్ మూవీలను బాగా చూసేలా ఉన్నట్లు అర్థమవుతోంది. ఎందుకంటే వారు చేసిన ఆ దొంగతనం.. హాలీవుడ్ సినిమా రేంజ్‌లో ఉంది. తమిళనాడు తిరుచ్చిలోని లలితా జ్యూవెలరీలో బుధవారం జరిగిన చోరీలో ఆ సన్నివేశాలు.. అచ్చం హాలీవుడ్ చిత్రం డార్క్ నైట్‌లో జరిగిన సీన్స్ రిపీట్ అయ్యాయి. షాపులో ఎలాగు సీసీ కెమెరాలు ఉంటాయని ఆలోచించిన ఆ దొంగలు.. చాకచక్యంగా వ్యవహరించారు. మొఖానికి మాస్క్‌ ధరించి.. కేవలం కళ్లు మాత్రమే […]

హాలీవుడ్ స్టైల్‌లో చోరీ.. లలితా జ్యూవెలరీలో ఆ రాత్రి ఏం జరిగింది..?
Follow us on

ఆ దొంగలు చేసిన చోరీ చూస్తే.. వాళ్లు హాలీవుడ్ మూవీలను బాగా చూసేలా ఉన్నట్లు అర్థమవుతోంది. ఎందుకంటే వారు చేసిన ఆ దొంగతనం.. హాలీవుడ్ సినిమా రేంజ్‌లో ఉంది. తమిళనాడు తిరుచ్చిలోని లలితా జ్యూవెలరీలో బుధవారం జరిగిన చోరీలో ఆ సన్నివేశాలు.. అచ్చం హాలీవుడ్ చిత్రం డార్క్ నైట్‌లో జరిగిన సీన్స్ రిపీట్ అయ్యాయి. షాపులో ఎలాగు సీసీ కెమెరాలు ఉంటాయని ఆలోచించిన ఆ దొంగలు.. చాకచక్యంగా వ్యవహరించారు. మొఖానికి మాస్క్‌ ధరించి.. కేవలం కళ్లు మాత్రమే కనపడేలా జాగ్రత్తపడ్డారు. అంతేకాదు.. చేతులకు గ్లౌజులు కూడా ధరించారు. దుకాణం వెనుక భాగంలో షెటర్లు కట్‌చేసి లోపలికి ప్రవేశించారు. తరువాత గోడకు కన్నం వేసి.. రూ.13 కోట్ల విలువ చేసే బంగారు నగలు, వజ్రాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.

దోపిడీ దొంగల గాలింపు కోసం 7 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈ ఘటన నార్త్ ఇండియా నుంచి వచ్చిన యువకులు చేసి ఉండొచ్చన్న అనుమానిస్తున్నారు. తిరుచ్చి ,మదురై ,తంజావూర్ ,పుదుకోట్టై జిల్లాలలో హోటల్స్ , లాడ్జి లలో స్పెషల్ టీమ్స్ తనిఖీలు చేపడుతున్నాయి. పుదుకోట్టైలో ఇప్పటికే ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. సంఘటన జరిగిన సమయంలో.. అక్కడి సెల్‌ ఫోన్స్ సిగ్నల్స్‌ని ట్రాక్ చేసేందుకు ప్రత్యేక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. మొత్తానికి ఈ చోరీ పక్కా ప్లాన్‌తో రెక్కీ నిర్వహించి చేసినట్లు అర్థమవుతోంది.