ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ పేషెంట్ ఆత్మహత్య..! వార్డులో ఉరి వేసుకొని మృతి.. కారణాలు ఇలా ఉన్నాయి..?

Covid Patient Suicide : కర్ణాటకలోని హవేరి జిల్లా ఆసుపత్రిలో ఓ కొవిడ్ పేషెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. కొవిడ్ పేషెంట్ల కోసం

ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ పేషెంట్ ఆత్మహత్య..! వార్డులో ఉరి వేసుకొని మృతి.. కారణాలు ఇలా ఉన్నాయి..?
Suicide

Updated on: May 15, 2021 | 11:58 AM

Covid Patient Suicide : కర్ణాటకలోని హవేరి జిల్లా ఆసుపత్రిలో ఓ కొవిడ్ పేషెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. కొవిడ్ పేషెంట్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డులో 70 ఏళ్ల వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాణెబెన్నూరుకు చెందిన లామాని తెగకు చెందిన వ్యక్తి మే 3 న కోవిడ్ -19 పాజిటివ్‌కు గురయ్యాడు. దీంతో పోలీసు అధికారులు స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. కొవిడ్ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల మే 5 న హవేరి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ఏమైందో తెలియదు కానీ శుక్రవారం వార్డు తలుపు దగ్గర ఉరివేసుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వార్డులో అందరు పేషెంట్లు నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి ఉరేసుకున్నట్లు సిసిటివి ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. అయితే ఆ పేషెంట్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటని ఆస్పత్రి వర్గాలను అడిగితే ఇలా చెప్పారు. అతడికి ఆస్పత్రిలో ఎలాంటి సమస్యలు లేవు. సరైన చికిత్స, సంరక్షణ అందించాం. అయితే కరోనా వల్ల అతడు నిరాశకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని అనుకుంటున్నాం అని తెలిపారు.

ఈ వారంలో ఇది రెండో ఆత్మహత్య. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో 50 ఏళ్ల కోవిడ్ -19 రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. సెహోర్ జిల్లాలోని రెహతి నివాసి అయిన ఈ వ్యక్తి హమీడియా ఆసుపత్రి ఆరో అంతస్తు నుంచి దూకి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసు అధికారి తెలిపారు. కరోనా వైరస్ పాజిటివ్ పరీక్షించిన తరువాత అతన్ని ఆదివారం ఆసుపత్రి జనరల్ వార్డులో చేర్చారు. అతను ఎందుకు ఈ చర్య తీసుకున్నాడో ఎవ్వరికి తెలియదు.

DRDO Drug 2-DG: కరోనా బాధితులకు శుభవార్త.. వచ్చేవారం అందుబాటులోకి రానున్న 2డీజీ డ్రగ్‌

Covid19 vaccine: వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరో మైలురాయి.. 18 కోట్లు దాటిన టీకాల పంపిణీ

మూడు సంవత్సరాల వయసులో నేర్చుకున్న నాట్యం.. తన జీవితాన్నే మార్చేసింది.. మాధురి దీక్షిత్ గురించి ఆసక్తికర విషయాలు..

Loading...
Unable to load recommendations.
Follow Us