Nuzividu: పోలీసుల పరువుతీసిన ‘ఇంటి దొంగ’.. స్టేషన్ లాకర్‌లోని సొమ్ముతో ఎస్కేప్

|

Sep 02, 2021 | 4:07 PM

అతడో పోలీస్. శాంతి భద్రతలను పరిరక్షించడం అతడి డ్యూటీ. నలుగురికి ఆదర్శంగా నిలవాలి. ఎవరైనా తప్పు చేస్తే తీసుకెళ్లి లాకప్‌లో వేయాలి. కానీ..

Nuzividu: పోలీసుల పరువుతీసిన ‘ఇంటి దొంగ’.. స్టేషన్ లాకర్‌లోని సొమ్ముతో ఎస్కేప్
Conistable Cheating
Follow us on

అతడో పోలీస్. శాంతి భద్రతలను పరిరక్షించడం అతడి డ్యూటీ. నలుగురికి ఆదర్శంగా నిలవాలి. ఎవరైనా తప్పు చేస్తే తీసుకెళ్లి లాకప్‌లో వేయాలి. కానీ అతడే దారి తప్పాడు. సేఫ్టీ కోసం స్టేషన్‌ లాకర్‌లో ఉంచిన సొత్తులో పరారయ్యాడు. కృష్ణా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. నూజివీడు పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ 16,56,340/- రూపాయల నగదు , కొంత బంగారాన్ని తీసుకుని పరారయ్యాడు. మద్యం అమ్మగా వచ్చిన నాలుగు దుకాణాలలో నగదును 3 రోజుల పాటు బ్యాంకు సెలవులు ఉన్న నేపథ్యంలో స్టేషన్ లాకర్ లో పెట్టారు పోలీసులు.  ఆది, సోమవారం సెలవులు రావటంతో లాకర్లో ఉన్న నగదు, బంగారం తీసుకుని పరారయ్యాడు ఓ కానిస్టేబుల్. ఘటనపై కేసు నమోదైంది. ఇష్యూపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో రెండు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడ్ని త్వరలో పట్టుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు.

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో మృతదేహాల కలకలం 

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని లంకపల్లిలో మృతదేహాలు కలకలం రేపాయి. ఓ పాడుబడిన ఇంట్లో రెండు డెడ్‌బాడీలు కనిపించాయి. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. వారు ఆత్మహత్య చేసుకున్నారో లేక ఎవరైనా హత్య చేశారా అన్న కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. కేసు నమోదు చేసి.. చుట్టుపక్కల ఉన్నవారిని విచారిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా స్థానికులను ప్రశ్నించారు. రెండ్రోజుల క్రితం వారు ఆత్మహత్య చేసుకుని ఉంటారని కొందరు భావిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు వేగవంతం చేసి వారి మృతికి గల కారణాలు తెలుసుకుంటామని చెప్పారు.

Also Read:  ‘మా’ ఎన్నికలకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్.. లెక్కలు మారుతున్నాయ్

ఆ బిజినెస్​మెన్‌ల​ భార్యలే అతడి టార్గెట్.. ఏకంగా రూ.200 కోట్లు కొట్టేశాడు.. జాక్వెలిన్​ ఫెర్నాండేజ్‌ను సైతం