బిగ్ బ్రేకింగ్ : కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్

| Edited By:

Mar 05, 2020 | 5:25 PM

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆయన్ను నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మంత్రి కేటీఆర్ లీజ్ తీసుకున్న ఫాంహౌస్ వద్ద డ్రోన్‌లతో చిత్రీకరించిన విషయంలో.. బుధవారం నార్సింగ్ పోలీసులు రేవంత్ రెడ్డితో సహా ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు. ఎంపీ రేవంత్ రెడ్డితో పాటుగా.. కృష్ణారెడ్డి, విజయసింహారెడ్డి, ప్రవీణ్‌పాల్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, ఓంప్రకాష్‌రెడ్డి, రాజేష్‌, శివలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 184, 187, […]

బిగ్ బ్రేకింగ్ : కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్
Follow us on

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆయన్ను నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మంత్రి కేటీఆర్ లీజ్ తీసుకున్న ఫాంహౌస్ వద్ద డ్రోన్‌లతో చిత్రీకరించిన విషయంలో.. బుధవారం నార్సింగ్ పోలీసులు రేవంత్ రెడ్డితో సహా ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు. ఎంపీ రేవంత్ రెడ్డితో పాటుగా.. కృష్ణారెడ్డి, విజయసింహారెడ్డి, ప్రవీణ్‌పాల్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, ఓంప్రకాష్‌రెడ్డి, రాజేష్‌, శివలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 184, 187, 11ఏ, రెడ్‌ విత్‌ 5ఏతో పాటుగా.. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేశారు. వీరిలో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ కూడా చేశారు.  ప్రైవేట్ ప్రాపర్టీలో అక్రమంగా డ్రోన్ ఎగురవేసినందుకుగాను వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. ఇప్పటికే గోపన్‌పల్లి భూకుంభకోణంలో కూడా రేవంత్‌ బ్రదర్స్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.