ఊయలే ఉరితాడుగా మారింది
కళ్ల ముందు ఆడుకుంటున్న బాలుడు కానరాని లోకాలకు పోయాడు. ఊయలలో ఆడుకుంటున్న బాలుడికి ఆ ఊయలే ఉరితాడైంది. కృష్ణా జిల్లాలో చోటుచేసుకున్న ఘటన ఆ తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చింది.
కళ్ల ముందు ఆడుకుంటున్న బాలుడు కానరాని లోకాలకు పోయాడు. ఊయలలో ఆడుకుంటున్న బాలుడికి ఆ ఊయలే ఉరితాడైంది. కృష్ణా జిల్లాలో చోటుచేసుకున్న ఘటన ఆ తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చింది.
కోడూరులోని జయపురం ఎస్సీవాడ చెందిన మద్దాల వెంకటేశ్వర్రావు, నాగరాణి దంపతులకు కార్తీక్(6), మూడేళ్ల కూతురు ఉన్నారు. వీరు గత కొన్నేళ్లుగా హైదరాబాద్లో పనిచేసుకుంటూ నివాసముంటున్నారు. ఇటీవల కరోనా లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి తమ సొంత గ్రామమైన జయపురానికి వచ్చారు. అయితే, సోమవారం కార్తీక్ తన చెల్లెతో కలిసి పక్కింట్లో ఆడుకునేందుకు వెళ్లాడు. అక్కడ చీరతో కట్టి ఉన్న ఊయలలో కార్తీక్ ఆడుకుంటుండగా చీర మెడకు చుట్టుకుంది. అది ఎంతకీ వదలక పోవడంతో కంగారుపడిన బాలుడు వదిలించుకునే ప్రయత్నం చేశాడు. అదీ మరిన్ని మెలికలు తిరుగుతూ బిగుసుకుపోయి చీర ఉచ్చులా మారింది. దీంతో ఒక్కసారి ఉపిరిడాక ఉక్కిరిబిక్కిరయ్యాడు బాలుడు. అక్కడే ఉన్న బాలుడి చెల్లెలు ఇది గమనించి కేకలు వేయడంతో ఇరుపొరుగు వారు వచ్చి కార్తీక్ను ఊయల నుంచి కిందకు దింపారు. కానీ అప్పటికే బాలుడి ప్రాణాలు గాలిలో కలిశాయి. కళ్లముందు ఆడుకుంటున్న కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. తండ్రి వెంకటేశ్వర్రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.