విషాదం..పెళ్లి అయిన 2 నెలలకే నవ దంపతులు మ‌ృతి

ఆస్ట్రేలియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్‌కు చెందిన నూతన వదూవరులు దర్మరణం చెందారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మృతులు కేరళకు చెందిర టీ మాథ్యూస్, నిను సుసెన్ ఏల్దోగా తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో ఈ దంపతులు కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వారు బయటకు రావడానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో అగ్నికి ఆహుతయ్యారు. ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం శుక్రవారం వేకువజామున 6 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. మాథ్యాస్ వయసు 30 కాగా, […]

విషాదం..పెళ్లి అయిన 2 నెలలకే నవ దంపతులు మ‌ృతి

Updated on: Dec 22, 2019 | 3:51 PM

ఆస్ట్రేలియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్‌కు చెందిన నూతన వదూవరులు దర్మరణం చెందారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మృతులు కేరళకు చెందిర టీ మాథ్యూస్, నిను సుసెన్ ఏల్దోగా తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో ఈ దంపతులు కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వారు బయటకు రావడానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో అగ్నికి ఆహుతయ్యారు. ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం శుక్రవారం వేకువజామున 6 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. మాథ్యాస్ వయసు 30 కాగా, ఏల్దో వయసు 28 ఏళ్లు.

ఈ ఏడాది అక్టోబర్ 28న వీరి పెళ్లి పెద్దల సమక్షంలో ఘనంగా జరిగింది. ఆ తర్వాత నవంబర్ 20న వీరు ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. అక్కడ నిను ఓ ప్రెవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుండగా, మాథ్యాస్ జాబ్ చేస్తున్నాడు. ఘటనపై ఆస్ట్రేలియా పోలీసులు..ఇరు కుటుంబాలకు సమాచారం అందించారు. కొత్త దంపతుల మృతితో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. కనీసం ఆఖరి చూపుకు కూడా నోచుకోకపోవడంతో పేరెంట్స్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.