Telangana: కరీంనగర్‌లో దారుణం.. ప్రియురాలిని చంపిన ప్రియుడు.. మూడు రోజుల క్రితం..

|

Jan 08, 2022 | 11:46 AM

Boyfriend kills girlfriend: ప్రియుడే కాలయముడయ్యాడు.. తనవెంట తీసుకెళ్లిన ప్రియురాలిని దారుణంగా చంపి పరారయ్యాడు. మూడు రోజుల

Telangana: కరీంనగర్‌లో దారుణం.. ప్రియురాలిని చంపిన ప్రియుడు.. మూడు రోజుల క్రితం..
Murder
Follow us on

Boyfriend kills girlfriend: ప్రియుడే కాలయముడయ్యాడు.. తనవెంట తీసుకెళ్లిన ప్రియురాలిని దారుణంగా చంపి పరారయ్యాడు. మూడు రోజుల కింద కనిపించకుండా వెళ్లిన యువతి విగతజీవిగా కనిపించింది. ప్రియుడే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఈ దారుణ సంఘటన తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మనకొండూర్ మండలం చెంజర్ల గ్రామ శివార్లలోని గుట్టలో యువతి వరలక్ష్మి (19) మృతదేహం లభ్యమైంది. ప్రియుడు అఖిల్ (22) ఆమెను గుట్ట ప్రాంతానికి తీసుకెళ్లి హత్యచేశాడు. మూడు రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకోగా.. శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది.

మూడు రోజుల నుంచి వరలక్ష్మి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలో వరలక్ష్మి మృతదేహం చెంజర్ల గ్రామ శివారులోని గుట్టలో కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తిమ్మాపూర్ పోలీసులు పేర్కొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకోని ప్రశ్నించగా.. ఆమెను తానే హత్యచేశానని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Vijayawada: దుర్గమ్మ దర్శనానికి వచ్చి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య..

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు.. నలుగురు దుర్మరణం