Crime news: ఏపీ గుంటూరులో మరో దారుణం.. ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై అత్యాచారయత్నం.. కర్రలతో కొట్టి..

|

Oct 22, 2021 | 7:25 PM

AP Crime news: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై అత్యాచారయత్నం కలకలం రేపింది. నగర శివారులో ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై కొందరు

Crime news: ఏపీ గుంటూరులో మరో దారుణం.. ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై అత్యాచారయత్నం.. కర్రలతో కొట్టి..
Crime News
Follow us on

AP Crime news: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై అత్యాచారయత్నం కలకలం రేపింది. నగర శివారులో ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై కొందరు అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. తాడికొండ మండలం మోతడకలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్న యువతి తన స్నేహితుడితో కలిసి ద్విచక్రవాహనంపై గురువారం రాత్రి గుంటూరుకు వెళ్తోంది. ఈ సమయంలో కొందరు యువకులు అడ్డగించి వారిపై కర్రతో దాడి చేశారు. అనంతరం యువతిని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో యువతి, యువకుడు గట్టిగా కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఈ ఘటన అనంతరం బాధితులు తాడికొండ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా.. విద్యార్థినిపై అత్యాచారయత్నం సంఘటన జిల్లాలో సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Also Read:

Crime News: వీళ్లు మామూలోళ్లు కాదు..  స్కెచ్ వేశారు.. ఏటీఎం కాలిపోయిందంటూ రూ.అరకోటి కొట్టేశారు.. చివరకు..

Harassment: ట్రైనింగ్‌ కోసం వచ్చిన బాలికతో కోచ్‌ అసభ్యకర ప్రవర్తన…కేసు నమోదు చేసిన పోలీసులు..