Students Drown: విషాదం నింపిన సరదా.. సముద్రంలో స్నానానికి వెళ్లి విద్యార్థుల గల్లంతు.. ఇద్దరు మృతి

|

Mar 22, 2021 | 1:34 AM

Students Dies: ఆదివారం కావడంతో స్నేహితులంతా సరదాగా సముద్ర తీరానికి వెళ్లారు. ఐదుగురు కలిసి సముద్రంలో స్నానానికి దిగి కేరింతలు కొడుతున్నారు. ఈ క్రమంలో వచ్చిన వచ్చిన రాకాసి అలల ధాటికి

Students Drown: విషాదం నింపిన సరదా.. సముద్రంలో స్నానానికి వెళ్లి విద్యార్థుల గల్లంతు.. ఇద్దరు మృతి
3 Students Dies Prakasam Dist
Follow us on

Students Dies: ఆదివారం కావడంతో స్నేహితులంతా సరదాగా సముద్ర తీరానికి వెళ్లారు. ఐదుగురు కలిసి సముద్రంలో స్నానానికి దిగి కేరింతలు కొడుతున్నారు. ఈ క్రమంలో వచ్చిన వచ్చిన రాకాసి అలల ధాటికి చెల్లచెదురయ్యారు. వారి సరదా యాత్ర కాస్త విషాదంగా మారింది. ఈ ఘటనలో మగ్గురు మరణించగా.. మరో ఇద్దరుర ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషాద సంఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కటారివారిపాలెం సముద్ర తీరంలో చోటు చేసుకుంది. గుంటూరులోని ఏటి అగ్రహారానికి చెందిన మద్దూరి భరత్ రెడ్డి (20), చుట్టుగుంటకు చెందిన మొగిలి ఉష(20), గట్టు మహేశ్‌ (20)తో పాటు మానస, జైశ్వంత్‌ ఆదివారం మధ్యాహ్నం కటారివారిపాలెం సముద్ర తీరానికి వచ్చారు. ఈ ఐదుగురూ కలిసి సముద్రంలో స్నానానికి దిగి.. సరదాగా ఈత కొడుతుండగా.. అలల ధాటికి గల్లంతయ్యారు. ఈ క్రమంలో స్థానికులు, మత్స్యకారులు వెంటనే వారిని గమనించి మానస, జైశ్వంత్‌లను కాపాడి ఒడ్డుకు చేర్చారు. భరత్ రెడ్డి, ఉష, మహేశ్‌ ముగ్గురూ గల్లంతయ్యారు.

అరగంట తర్వాత భరత్ రెడ్డి, ఉషా మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. మహేశ్‌ కోసం ఈతగాళ్లు సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఆసుపత్రికి తరలించారు. మహేష్‌ ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులు ఉష బి ఫార్మసీ చదువుతుండగా.. భరత్‌ బీటెక్ చదువుతున్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

రాజస్థాన్‌లో విషాదం.. ఊపిరాడక ఐదుగురు పిల్లల మృతి

Gold Smuggling: గోల్డ్ స్మగ్లింగ్..! అయితే వీరు కాస్తా వెరైటీ..! దొరికిపోయారు..! దాచింది ఎక్కడో తెలుసా..?