East Godavari: బైక్‌ను ఢీకొట్టిన వ్యాన్.. కొడుకుతో సహా దంపతుల దుర్మరణం..

|

Feb 20, 2022 | 12:58 PM

East Godavari Accident: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా ఎదురులంక - యానాం బాలయోగి వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో

East Godavari: బైక్‌ను ఢీకొట్టిన వ్యాన్.. కొడుకుతో సహా దంపతుల దుర్మరణం..
Road Accident
Follow us on

East Godavari Accident: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా ఎదురులంక – యానాం బాలయోగి వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఆదివారం బైక్‌ను వ్యాన్‌ ఢీకొట్టింది. ( Road Accident) ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులతో సహా కుమారుడు మృతి చెందాడు. ఘటనలో కుమార్తెకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమెను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కుటుంబంతో సహా.. వ్యక్తి కాకినాడ (Kakinada) వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో వంతెనపై  ట్రాఫిక్ జాం అయింది.

మృతులు ఐ.పోలవరం మండలానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వ్యాన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పేర్కొంటున్నారు. మృతులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read:

Rajasthan Crime: ఘోర ప్రమాదం.. అదుపు తప్పి నదిలో పడ్డ కారు.. వరుడు సహా తొమ్మిది మంది మృతి

Babu Gogineni: ఏ పార్టీకి మద్దతు లేదు.. సోషల్ మీడియాలో ప్రచారంపై బాబు గోగినేని క్లారిటీ..