కరోనా విరుగుడు వ్యాక్సీన్ కోసం 800 కోట్ల డాలర్ల సేకరణ.. ప్రపంచ దేశ నేతల ప్రమాణం

| Edited By: Pardhasaradhi Peri

May 05, 2020 | 4:36 PM

కరోనాను అదుపు చేసేందుకు అవసరమయ్యే పరిశోధనలకు, వ్యాక్సీన్ ఉత్పత్తికి, దాని పంపిణీకి, చికిత్సకు సైతం 800 కోట్ల డాలర్లను సేకరించాలని ప్రపంచ దేశాల నాయకులు, కొన్ని సంస్థల సభ్యులు ప్రకటించారు. అయితే ఈ విరాళాల సేకరణలో సహకరించేందుకు అమెరికా నిరాకరించింది. బ్రస్సెల్స్ లో ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో యూరోపియన్ యూనియన్, బ్రిటన్ , నార్వే, సౌదీ అరేబియా, జపాన్, కెనడా, సౌతాఫ్రికా దేశాల నాయకులు, ఇతర దేశాల ప్రతినిధులు పాల్గొని ఈ ప్రమాణం చేశారు. […]

కరోనా విరుగుడు వ్యాక్సీన్ కోసం 800 కోట్ల డాలర్ల సేకరణ.. ప్రపంచ దేశ నేతల ప్రమాణం
Follow us on

కరోనాను అదుపు చేసేందుకు అవసరమయ్యే పరిశోధనలకు, వ్యాక్సీన్ ఉత్పత్తికి, దాని పంపిణీకి, చికిత్సకు సైతం 800 కోట్ల డాలర్లను సేకరించాలని ప్రపంచ దేశాల నాయకులు, కొన్ని సంస్థల సభ్యులు ప్రకటించారు. అయితే ఈ విరాళాల సేకరణలో సహకరించేందుకు అమెరికా నిరాకరించింది. బ్రస్సెల్స్ లో ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో యూరోపియన్ యూనియన్, బ్రిటన్ , నార్వే, సౌదీ అరేబియా, జపాన్, కెనడా, సౌతాఫ్రికా దేశాల నాయకులు, ఇతర దేశాల ప్రతినిధులు పాల్గొని ఈ ప్రమాణం చేశారు. చైనా తరఫున తన రాయబారిని ఈ  కార్యక్రమంకోసం నిర్దేశించింది. ప్రపంచ బ్యాంకు, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సంస్థలతో బాటు బడా కుబేరుల నుంచి కూడా నిధులను సమీకరించాలని నిర్ణయించారు. కొన్ని గంటల్లోనే తాము 7.4 బిలియన్ యూరోలను (8.1 బిలియన్ డాలర్లు) సేకరించినట్టు యూరోపియన్ కమిషన్ హెడ్ ఉర్సులా వాన్ డెర్ లియెన్ తెలిపారు. పాప్ సింగర్ మడోన్నా అప్పుడే 10 లక్షల యూరోలను విరాళంగా ఇస్తానని ప్రకటించిందన్నారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. కరోనా వ్యాధి చికిత్సకు వ్యాక్సీన్ ఇప్పుడు ఎంతయినా అవసరమన్నారు. ప్రపంచ ప్రజలకు ఇది రక్షా కవచంగా ఉండగలదన్నారు.