విద్యాసంవ‌త్స‌రం వాయిదా…తిరిగి

|

Apr 26, 2020 | 9:26 AM

ఏటా జులైలో ప్రారంభమయ్యే నూతన విద్యాసంవత్స‌రాన్ని ఈ యేడు ఎప్పుడు ప్రారంభించాల‌ని, అన్ని విద్యా సంస్థ‌లు ..

విద్యాసంవ‌త్స‌రం వాయిదా...తిరిగి
Follow us on
ఏటా జులైలో ప్రారంభమయ్యే నూతన విద్యాసంవత్స‌రాన్ని ఈ యేడు సెప్టెంబ‌ర్‌లో ప్రారంభించాల‌ని, అన్ని విద్యా సంస్థ‌లు అప్పుడే తెర‌వాల‌ని యూజీసీ నిపుణుల క‌మిటీపేర్కొంది. ఈ నేపథ్యంలో అకడమిక్‌ అంశాలు, ఆన్‌లైన్‌ విద్య తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు యూజీసీ రెండు కమిటీలను ఏర్పాటు చేసింది.
క‌రోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో దేశంలో నెలకొన్న పరిస్థితుల కార‌ణంగా విద్యాసంవత్సరం నిర్వహణ ఆన్లైన్ విద్యపై ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో సిఫార్సు చేసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇటీవల రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. హరియాణా యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ఆర్‌సీ కుహద్‌ నేతృత్వంలోని కమిటీ లాక్‌డౌన్‌ నేపథ్యంలో యూనివర్సిటీల్లో పరీక్షల నిర్వహణ, ప్రత్యామ్నాయ చర్యలపై అధ్యయనం చేసింది.
ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (ఇగ్నో) వైస్‌ చాన్స్‌లర్‌ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మరో కమిటీ ఆన్‌లైన్‌ పరీక్షలపై అధ్యయనం చేసింది. శుక్రవారం ఆ కమిటీలు యూజీసీకి తమ నివేదికలను అందజేశాయి. అందులో కుహద్‌ నేతృత్వంలోని కమిటీ విద్యా సంవత్సరాన్ని జూలైకి బదులు సెప్టెంబర్‌లో ప్రారంభించాలని సిఫారసు చేసింది. ఇక నాగేశ్వర్‌రావు కమిటీ యూనివర్సిటీల్లో కావాల్సినంత మౌలిక సదుపాయాలు ఉంటే ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించవచ్చని సూచించింది.