మరోసారి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అందుకు కొత్త మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 29 వరకూ లాక్డౌన్ విధించారు. దీంతో తెలంగాణలో ఏం చేయాలన్న అంశంపై ఇవాళ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేయనుంది. ఇందుకోసం సాయంత్రం 5 గంటలకు తెలంగాణలోని ప్రగతి భవన్లో.. కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్ అంత్యంత కీలకం కానుంది. ప్రస్తుతం తెలంగాణలో తక్కువగా కేసులు నమోదవుతున్నాయి. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం ఈ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి మినహాయింపులు ఇస్తుంది? లాక్డౌన్ను పొడిగిస్తుందా? మళ్లీ ఎలాంటి కొత్త మార్గదర్శకాలు జారీ కాబోతున్నాయి? అనే దానిపై ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కేబినెట్ భేటలో ముఖ్యంగా చర్చకు వచ్చే కీలకాంశాలు ఇవే:
– ముఖ్యంగా లాక్డౌన్ పొడిగిస్తారా? లేదా?
– సమగ్ర వ్యవసాయ విధానంపై దృష్టి
– వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడం
– సాగునీటి ప్రాజెక్టులపై చర్చ
– రైతులు ఏ పంటలు పండించాలి
– వర్షాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
– ఆర్టీసీ బస్సులు నడపాలా? వద్దా?
– అలాగే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచుతూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 203 అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
Read More: