AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో మళ్లీ మూడెంకలు దాటుతున్న కరోనా కేసులు.. గడిచిన 24గంటల్లో 111 మందికి పాజిటివ్

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు మెల్లమెల్లగా పెరగుతున్నాయి. ఇంతకాలం తక్కువగా నమోదైన కేసులు క్రమంగా పెరగుతున్నాయి.

తెలంగాణలో మళ్లీ మూడెంకలు దాటుతున్న కరోనా కేసులు.. గడిచిన 24గంటల్లో 111 మందికి పాజిటివ్
Balaraju Goud
|

Updated on: Mar 08, 2021 | 11:35 AM

Share

telangana corona : తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు మెల్లమెల్లగా పెరగుతున్నాయి. ఇంతకాలం తక్కువగా నమోదైన కేసులు క్రమంగా పెరగుతున్నాయి. మరోవైపు కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. శనివారం రాత్రి 8గంటల నుంచి ఆదివారం రాత్రి 8గంటల వరకు 19,929 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 111 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 3,00,011కి చేరుకుంది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.

మరోవైపు రాష్ట్రంలో నిన్న కరోనాతో ఒకరు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,642కి చేరింది. ఇక, ఆదివారం కరోనా బారి నుంచి కోలుకుని 189 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,96,562కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,807 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 689 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే తాజాగా 27 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మరోవైపు తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 89,84,552కి చేరింది.