సోను సూద్ ని ఆపింది మేము కాదు.. ముంబై పోలీసుల క్లారిటీ

| Edited By: Pardhasaradhi Peri

Jun 09, 2020 | 12:41 PM

కొంతమంది వలస కార్మికులను కలుసుకునేందుకు ఈ నెల 8 న బాంద్రా టర్మినస్ కి చేరుకున్న సినీ నటుడు సోను సూద్ ని రైల్వే రక్షక దళం సిబ్బంది ఆపివేశారని ముంబై పోలీసులు..

సోను సూద్ ని ఆపింది మేము కాదు.. ముంబై పోలీసుల క్లారిటీ
Follow us on

కొంతమంది వలస కార్మికులను కలుసుకునేందుకు ఈ నెల 8 న బాంద్రా టర్మినస్ కి చేరుకున్న సినీ నటుడు సోను సూద్ ని రైల్వే రక్షక దళం సిబ్బంది ఆపివేశారని ముంబై పోలీసులు తెలిపారు. అంతే తప్ప.. తాము కాదని, కానీ ఇందుకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని వారు చెప్పారు. బాంద్రా టర్మినస్ నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లే శ్రామిక్ రైలు కోసం ఆ వలస జీవులంతా వేచి చూస్తున్నప్పుడు సోను సూద్ అక్కడికి చేరుకున్నాడని  వారు వివరించారు. వలస కార్మికుల తరలింపు విషయంలో సీఎం ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోందని చూపడానికే సోను సూద్ ని బీజేపీ రంగంలోకి దింపిందని శివసేన నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. అయితే ఈ సినీ నటుడు….. శ్రామిక జీవుల తరలింపు కోసం బస్సులను ఏర్పాటు చేయడాన్ని ఉధ్ధవ్ థాక్రే అభినందించారు. ఈ విషయంలో ఎవరు, ఎలా కృషి చేసినా అభినందనీయమేనన్నారు. అటు-సూద్ చూపిన చొరవను రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించిన సంగతి విదితమే.